కర్ణాటకలో బీజేపీ యువనేత దారుణహత్య...వెంటాడి మరీ...

Published : Jul 28, 2022, 07:12 AM IST
కర్ణాటకలో బీజేపీ యువనేత దారుణహత్య...వెంటాడి మరీ...

సారాంశం

కర్ణాటక లో దారుణ ఘటన జరిగింది. బీజేపీ యువనేతను దుండగులు వెంటాడి మరీ దాడి చేసి... దారుణంగా హత్య చేశారు. 

కర్ణాటక : బీజేపీ యువనేత హత్యతో కర్ణాటకలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. దక్షిణ కన్నడ జిల్లాలో బిజెపి యువ మోర్చా  యువనేత ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, ప్రవీణ్ స్వస్థలం సుళ్యా తాలూకా బెళ్లారపేట కేరళ సరిహద్దులో ఉంది. కాగా, ప్రవీణ్ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్చను నిర్వహిస్తున్నాడు. అయితే, మంగళవారం రాత్రి షాపు మూసేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతని మీద దాడి చేశారు. ప్రవీణ్ ను బైక్ మీద వెంటాడి మరీ చంపారు. 

ఆ తరువాత రక్తపుమడుగులో పడివున్న అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు ప్రవీణ్ ను పుత్తూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రవీణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం కాస్త బిజెపి నేతలు, యువమోర్చా నాయకులకు తెలియడంతో వారు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అర్థరాత్రి రోడ్డు మీద కూర్చుని నిరసన తెలిపారు ఈ క్రమంలో  ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. యువ నాయకుడు దారుణ హత్యకు గురికావడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ప్రవీణ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Army Training Aircraft Crashes: ప్రమాదానికి గురైన విమానం ఎలా రక్షిస్తున్నారో చూడండి | Asianet Telugu
Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా