Karnataka: ముఖ్యమంత్రిని మార్చుతున్నారంటూ వస్తున్న వార్తలను పార్టీ ఖండించింది. సీఎం బొమ్మైని బర్తరఫ్ చేశారనే ఊహాగానాలలో నిజం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు.
Karnataka: 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నాయకత్వంలోనే పోటీ చేస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం ప్రకటించింది. ముఖ్యమంత్రిని మార్చుతున్నారంటూ వస్తున్న వార్తలను పార్టీ ఖండించింది. సీఎం బొమ్మైని బర్తరఫ్ చేశారనే ఊహాగానాలలో నిజం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇంచార్జి అరుణ్ సింగ్ అన్నారు. దీంతో ఈ ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.
కర్ణాటక ఇంచార్జి అరుణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇన్చార్జ్గా తాను చెప్పుతున్న విషయాన్ని నమ్మాలనీ, వచ్చే ఎన్నికల్లో బొమ్మై నాయకత్వంలో 100 శాతం పోరాడతామని చెప్పాను. సీఎం బొమ్మై సామాన్యుడనీ, రైతులు, యువత, ఎస్సీ, ఎస్టీల కోసం పనిచేస్తున్నారని, పూర్తి మెజారిటీతో మళ్లీ వస్తామన్నారు. బీజేపీ లక్ష్యం 150 సీట్లు, అది కూడా సాధిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని మార్చడంపై వచ్చిన ఊహాగానాలు హాస్యాస్పదంగా ఉన్నాయని కొట్టిపారేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బొమ్మై నాయకత్వంలోనే పార్టీ పోటీ చేసి రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాల కారణంగా విడిపోయిన ప్రతిపక్ష పార్టీ గందరగోళం సృష్టించేందుకు ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నదని ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ కుట్ర అని, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నదని సింగ్ అన్నారు.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కీలుబొమ్మ సిఎం అని ఆరోపించడంపై ఆయన సిరియస్ అయ్యారు.
బొమ్మై సామాన్యుడని, ఆయన రైతులు, యువత, ఎస్సీ/ఎస్టీల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఆందోళన చెందవద్దు. బీజేపీకి వ్యతిరేకంగా తమకు మరో అజెండా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ఇలాంటివి లేవనెత్తుతోంది. ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఇటీవల బీజేపీ మాజీ ఎమ్మెల్యే బీ సురేష్ గౌడ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రిని మార్చడంతోపాటు భవిష్యత్తులో ఎన్నికల్లో విజయం సాధించేలా హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని గౌడ చెప్పారు. ఆయన ప్రకటనలు సీఎంను మారుస్తారనే ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై చర్చ పార్టీ కార్యకర్తలలో గందరగోళాన్ని సృష్టించిన తరుణంలో కర్ణాటక ఇంచార్జి అరుణ్ సింగ్ ప్రకటన వచ్చింది.
2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత 14 నెలల పాటు కర్నటకలో కాంగ్రెస్, జెడి (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం ఉంది, అయితే 2019లో అవిశ్వాస ఓటింగ్లో ఓడిపోవడంతో అది పడిపోయింది, ఇది బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.
దక్షిణ కన్నడ జిల్లాలో యువనేత ప్రవీణ్ నెట్టార్ హత్య తర్వాత ముఖ్యమంత్రి బొమ్మై ఇటీవల బిజెపి నాయకత్వం నుండి దాడికి గురయ్యారు. త్వరలో ముఖ్యమంత్రి పదవి మారితే తాను ముఖ్యమంత్రి రేసులో ఉంటానని బీజేపీ మంత్రి ఉమేష్ కత్తి ప్రకటించారు. గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక పర్యటన తర్వాత నాయకత్వంలో మార్పు వస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.