బీహార్ లో బీజేపీ, జేడీ(యూ)లు ఏక్ నాథ్ షిండేల కోసం వెతుకుతున్నాయ్ - ఎల్జేపీ మాజీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్

Published : Jul 04, 2022, 02:04 PM IST
బీహార్ లో బీజేపీ, జేడీ(యూ)లు ఏక్ నాథ్ షిండేల కోసం వెతుకుతున్నాయ్ - ఎల్జేపీ మాజీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్

సారాంశం

బీహార్ లో అధికారంలో ఉన్న బీజేపీ, జేడీ(యూ)లు రెండు ఆయా పార్టీల నుంచి ఏక్ నాథ్ షిండేల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని ఎల్జేపీ మాజీ చీఫ్, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు పార్టీలపై విమర్శలు చేశారు. 

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పార్టీ జేడీ(యూ), దాని మిత్రపక్షమైన బీజేపీలు పరస్పరం ఓడించేందుకు తమ తమ ఏక్‌నాథ్‌ షిండే కోసం వెతుకుతున్నాయని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) మాజీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ ఆరోపించారు. రెండు పార్టీలు అధికారం కోసమే పొత్తు పెట్టుకున్నాయని, సైద్ధాంతిక అంశాల్లో నితీష్‌కు బీజేపీ లొంగిపోయిందని చిరాగ్  విమర్శించారు.  ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు. రెండు పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆయ‌న విమ‌ర్శలు చేశారు. 

monsoon: దేశంలో విస్తారంగా వర్షాలు.. రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు

పాట్నాలో, రాష్ట్రంలో సంఖ్యాపరంగా బీజేపీని రెండో స్థానానికి తీసుకురావడానికి నితీష్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నలుగురు AIMIM ఎమ్మెల్యేలను RJDలో చేర్చడంలో పాత్ర పోషించారని చిరాగ్ పేర్కొన్నారు. AIMIM ఎమ్మెల్యే JD(U)తో టచ్‌లో ఉన్నారని, ఆ పార్టీలో (JDU) తనకు అంత భవిష్యత్తు లేదని, అందుకే ఆయ‌న RJDలో చేరాడ‌ని ఎంపీ చిరాగ్ పేర్కొన్నారు. AIMIM విచ్ఛిన్నం వెనుక నితీష్ ఉన్నార‌ని అన్నారు. దీని ఫ‌లితంగా ఇప్పుడు RJD బీజేపీ నుంచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాను లాక్కుంద‌ని చెప్పారు.

అగ్నిపథ్ స్కీంను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారించనున్న సుప్రీంకోర్టు

మహారాష్ట్రలో ఇటీవలి రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ.. బీహార్‌లో అధికారంలో ఉన్న రెండు పార్టీల‌పై చిరాగ్ సెటైర్లు వేశారు.“ రెండు పార్టీలు అధికారం కోసం మాత్రమే కలిసి ఉన్నాయి. రెండూ మిత్రపక్షాన్ని క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనిని బట్వాడా చేయగల ఏకనాథ్ షిండే కోసం వెతుకుతున్నాయి’’ అని అన్నారు. కాగా.. మహారాష్ట్రలో శివసేన పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న ఏక్ నాథ్ షిండే ప‌లువురు ఎమ్మెల్యేల‌ను తీసుకొని తిరుగుబాటు చేసిన సంగ‌తి తెలిసిందే. శివ‌సేన‌, కాంగ్రెస్, ఎన్సీలు మూడు క‌లిసి సంకీర్ణ ఎంవీఏ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

కుక్క మొరిగిందని.. శునకంతో పాటు మరో ముగ్గురిపై ఇనుపరాడ్ తో దాడి..

ఏక్ నాథ్ షిండే తిరుబాటుతో ఎంవీఏ ప్ర‌భుత్వం కూలిపోయింది. ఈ సంకీర్ణ ప్ర‌భుత్వానికి నేతృత్వం వ‌హించిన శివ‌సేన చీఫ్, సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ మ‌ద్ద‌తుతో ఏక్ నాథ్ షిండే మ‌హారాష్ట్ర కొత్త సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్య‌మంత్రిగా బీజేపీ నేత‌, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ కొత్త ప్ర‌భుత్వం నేడు అసెంబ్లీలో త‌న మెజారిటినీ నిరూపించుకుంది. నిన్న జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ నార్వేక‌ర్ స్పీక‌ర్ గా ఎన్నిక‌య్యారు. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు వ‌ల్లే మ‌హారాష్ట్రలో ఈ రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసున్న నేప‌థ్యంలో చిరాగ్ పాశ్వాన్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu