బీజేపీ అడ్డుకోవాల్సిందే.. ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త విఫ‌ల‌మైతే దేశ భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డుతుంది : క‌పిల్ సిబల్

Published : Jun 12, 2023, 10:26 AM IST
బీజేపీ అడ్డుకోవాల్సిందే.. ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త విఫ‌ల‌మైతే దేశ భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డుతుంది : క‌పిల్ సిబల్

సారాంశం

New Delhi: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల ఐక్యతకు రాజ్య‌స‌భ ఎంపీ కపిల్ సిబల్ పిలుపునిచ్చారు. ప్ర‌తిప‌క్షాల ఐత్య‌క లోపిస్తే భార‌త పాల‌న భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ కూడా కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్ర‌తిప‌క్షాల‌ సమిష్టి ప్రతిఘటన అవసరాన్ని నొక్కి చెప్పారు.  

Kapil Sibal pitches for opposition unity: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యతకు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను రద్దు చేసే ప్రయత్నమని కపిల్ సిబల్ విమర్శించారు. అయితే, దీనిపై సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పు వెలువరించనుందని తెలిపారు. ఢిల్లీలో ఆప్ ఘన విజయం బీజేపీని కలవరపాటుకు గురిచేసిందనీ, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ పార్టీ పనితీరును అడ్డుకోవాలని కృతనిశ్చయంతో ఉందన్నారు. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించకపోతే ఎన్నికలు నిర్వహించి ఢిల్లీలో అసెంబ్లీ, మంత్రివర్గాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని సిబల్ ప్రశ్నించారు. ఇది ఎన్నికైన ప్రభుత్వ స్వయంప్రతిపత్తిని, అధికారాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుందని, ప్రజాస్వామ్య పాలన సారాంశాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.  రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఆర్డినెన్స్ ను ఢిల్లీ ప్రభుత్వం సవాలు చేసిందని, సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను అధిగమించడానికి బ్యూరోక్రాట్ల నిర్ణయాలను అనుమతించడం వల్ల శాసనసభ బలహీనపడుతుందనీ, అది అర్థరహితమవుతుందని ఆయన అన్నారు.

కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్వహించిన మ‌హార్యాలీలో ఆయన ప్రసంగించారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో మరే ప్రభుత్వం, పార్టీ మనుగడకు ఆస్కారం లేకుండా పోయిందన్నారు. "ప్రతిపక్షాలను అణ‌చివేసి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడమే నరేంద్ర మోడీ 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వం' లక్ష్యం. అయితే, ఇది 'డబుల్ బ్యారెల్' ప్రభుత్వం తప్ప మరేమీ కాదు, ఒక బ్యారెల్ కు ఈడీ, మరొకటి సీబీఐ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బాధ్యతాయుత పక్షపాత రహిత పార్లమెంటేరియన్ గా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ ఈ రోజు మీ ముందు నిల్చున్నాను. ఇది న్యాయం కోసం జరుగుతున్న పోరాటం.. ప్రతిపక్షాలన్నీ కలిసి 2024లో మోడీని ఓడిస్తాయ‌ని" ఆశాభావం వ్య‌క్తంచేశారు. కపిల్ సిబల్ ప్రారంభించిన 'ఇన్సాఫ్ కే సిపాహి' ప్రచారంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీనియర్ న్యాయవాది గొప్ప పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు.

ల‌వ్ జిహాద్: ముస్లిం దుకాణంపై మూక దాడి.. ఉత్త‌రాఖండ్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు

ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి మన గొప్ప దేశం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, ఈ ఆర్డినెన్స్ నియంతృత్వానికి, నిరంకుశత్వానికి పరాకాష్ట అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ఢిల్లీలో కేజ్రీవాల్ ఏ నేరానికి శిక్ష అనుభవిస్తున్నారని ప్రశ్నించారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, ఆదర్శవంతమైన పాఠశాలల నిర్మాణం, ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్ల ఏర్పాటు, వృద్ధులకు తీర్థయాత్రలు నిర్వహించడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సులభతరం చేయడం వంటి చేయ‌డం వ‌ల్ల ఈ శిక్ష‌లా? అంటూ ప్ర‌శ్నించారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నిర్మించిన పాఠశాలలను సందర్శించాలని అమెరికా ప్రథమ మహిళ తన ఆకాంక్షను వ్యక్తం చేయడం భారతదేశ చరిత్రలోనే తొలిసారి అని సింగ్ పేర్కొన్నారు.

చికెన్ ప్రియుల‌కు షాక్.. ఆకాశ‌మే హ‌ద్దుగా పెరుగుతున్న ధ‌ర‌లు


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు