ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలకు లొంగిపోయిన బీజేపీ సర్కారు: కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే

Published : Nov 26, 2022, 11:57 PM IST
ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలకు లొంగిపోయిన బీజేపీ సర్కారు: కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే

సారాంశం

New Delhi: ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలకు బీజేపీ సర్కారు లొంగిపోయిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరించడానికి ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీని ఉపయోగించుకుంటున్నదని కూడా ఆయ‌న విమ‌ర్శించారు.  

Congress president Mallikarjun Kharge: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ రాజ్యాంగం ప్రాథమిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు.  నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన ఆయ‌న.. అందరూ ఐక్యంగా భారతదేశాన్ని తిరిగి విలువలకు చేర్చే సమయం ఆసన్నమైందన్నారు. దేశం గర్వించదగ్గ రోజుగా ఉండాల్సిన రోజున, అధికార పార్టీ, దాని భావజాలం రూపొందించిన లేని చట్టాన్ని ఇది చూస్తోందని చెప్పారు. 'ది లూమింగ్ క్రైసిస్ ఆఫ్ ది ఇండియన్ కన్స్టిట్యూషన్' అనే లిఖితపూర్వక బహిరంగ ప్రకటనలో ఖర్గే ఈ వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పదాలను పరస్పరం మార్చుకోవచ్చనీ పేర్కొన్న ఆయ‌న‌..  ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలకు బీజేపీ సర్కారు లొంగిపోయిందని నొక్కిచెప్పారు.

"ఏడు దశాబ్దాలుగా విజయవంతంగా కాలపరీక్షకు నిలిచిన రాజ్యాంగం, నేడు ఈ రాజ్యాంగం ఒక ప్రాథమిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిజానికి దాని వాస్త‌వ టెక్స్ట్ వెనుక ఉన్న స్ఫూర్తికి అస్తిత్వ సంక్షోభం ఇదని" మల్లికార్జున ఖర్గే అన్నారు. సామాజిక సేవ అనే ముసుగులో ద్వేషపూరిత ప్రచారాన్ని సాగిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలకు ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయిందనీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అనే పదాలను పరస్పరం మార్చుకోవడం సరికాదని ఖర్గే అన్నారు. "మనందరికీ గర్వకారణం కావాల్సిన రోజు నేడు.. అయితే, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం క్రమపద్ధతిలో రూపొందించిన ప్రాథమిక హక్కులపై అంతులేని ఉల్లంఘనలతో ముందుకు సాగుతున్న‌ది.. బాబా సాహెబ్ రూపొందించిన భార‌త రాజ్యాంగాన్ని నీరు గారుస్తున్నారు" అని ఖర్గే అన్నారు.

స్వాతంత్య్రాన్ని అరికట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీని ఉపయోగించుకుంటుందని కూడా మ‌ల్లికార్జున‌ ఖర్గే అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరించడానికి ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీని ఉపయోగించుకుందని ఆయ‌న ఆరోపించారు. "అక్రమం ఇప్పుడు ప్రధాన స్రవంతిగా మారినందున చట్టవ్యతిరేకమైనది" అని ఖర్గే అన్నారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం 'అసమ్మతిని వ్యక్తం చేయడానికి' ఎటువంటి మార్గాలను అందించలేదని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీలను అణ‌చివేయ‌డానికి బీజేపీ ప్ర‌భుత్వం.. కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం గురించి అంశాల‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్రతిపక్షాలు ఏవైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను బలవంతంగా వారిపైకి ఊసిగొల్పుతూ.. అధికార దుర్వినియోగం చేయడం ద్వారా వాటిని పరిష్కరించుకుంటున్నార‌ని ఖ‌ర్గే అన్నారు. 

 

దేశంలో ప్రబలంగా ఉన్న సమస్యలను ప్రస్తావించిన ఖ‌ర్గే.. 'న్యాయమూర్తుల రహస్య మరణాలు', 'ఆయుధ శిక్షణలో పిల్లలకు సూచనలు ఇవ్వడం', 'సెలబ్రేట్' చేసే మైనారిటీలపై దాడులు మొదలైన వాటిని ప్రస్తావించారు. బీజేపీ విద్వేషపూరిత ఎజెండాకు అనుగుణంగా చరిత్ర పుస్తకాలు తిరగరాస్తున్నారని కూడా ఆయ‌న ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu