రాజస్థాన్‌లో దళిత యువతిపై యాసిడ్ దాడి, హత్య: కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్

Published : Jul 13, 2023, 08:37 PM IST
 రాజస్థాన్‌లో దళిత యువతిపై  యాసిడ్ దాడి, హత్య: కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్

సారాంశం

దళిత సామాజిక వర్గానికి చెందిన  19 ఏళ్ల యువతిపై  యాసిడ్ తో దాడి చేసి హత్య చేయడంపై  బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో  మహిళల రక్షణకు  ఈ ఘటన అద్దం పడుతుందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ జైహింద్ విమర్శించారు

న్యూఢిల్లీ: దళిత సామాజిక వర్గానికి చెందిన  19 ఏళ్ల యువతిపై యాసిడ్ తో దాడి చేసి  హత్య చేశారు.  మృతదేహన్ని బావిలో వేశారు నిందితులు. ఈ ఘటన రాజస్థాన్ లో మహిళలు, బాలికల భద్రతకు అద్దం పడుతుందని  బీజేపీ విమర్శించింది.  

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జైహింద్  ట్విట్టర్ వేదికగా ఈ విషయమై  కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  ఈ ఘటన పట్ల ఆయన దిగ్బ్రాంతిని వ్యక్తం  చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం మహిళలకు, దళితులకు ఏ రకమైన రక్షణ కల్పిస్తుందో  ఈ ఘటన అద్దం పడుతుందన్నారు.    ఈ విషయమై  కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన  ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టే ఆమె మౌనంగా ఉన్నారా అని ఆయన అడిగారు.

 

ఈ ఏడాది జూన్ మాసంలో  కోచింగ్ సెంటర్ కు వెళ్తున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం  జరిగింది.అత్యాచారం చేసిన తర్వాత బాలికను హత్య చేశారు నిందితులు. రాజస్థాన్ లోని బికనీర్ లో ఈ ఘటన చోటు  చేసుకుంది.  ఈ ఘటన జరిగిన  మూడు వారాలకే  దళిత యువతిపై యాసిడ్ తో దాడి చేసి హత్య చేయడం కలకలం రేపుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood