రాజస్థాన్ లో శాంతి భద్రతలు క్షీణించాయి: కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్

Published : Jul 19, 2023, 06:10 PM IST
రాజస్థాన్ లో శాంతి భద్రతలు క్షీణించాయి: కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్

సారాంశం

రాజస్థాన్ లో శాంతి భద్రతలు క్షీణించాయని  బీజేపీ ఆరోపించింది.  రాష్ట్రంలో చోటు  చేసుకున్న ఘటనలను ఆ పార్టీ ప్రస్తావించింది.

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జైహింద్ విమర్శించారు.
రాజస్థాన్ లో జరుగుతున్న వరుస ఘటనలను  ఆయన ఈ వ్యాఖ్యలు  చేశారు.  జోధ్ పూర్ హత్యల తర్వాత  తాజాగా  మంత్రి బంధువు  హోటల్ లో దాడులకు దిగడాన్ని  జైహింద్ ప్రస్తావించారు. ఈ మేరకు  ట్విట్టర్ లో ఓ వీడియోను కూడ ఆయన షేర్ చేశారు.

మంత్రి మేనల్లుడు  గూండాలతో  హోటల్ పై దాడి చేసి  హింసకు పాల్పడ్డాడని  ఆయన గుర్తు  చేశారు.  ఈ ఘటనపై  ఎలాంటి చర్యలు తీసుకోలేదని  జైహింద్ విమర్శించారు. మరో వైపు రాజస్థాన్ సీఎం గెహ్లాట్   నిందితులను రక్షించే ప్రయత్నం  చేస్తున్నారని ఆయన  ఆరోపించారు.

 

ఇదిలా ఉంటే  ఈ ఏడాది జూన్ మాసంలో  దళిత బాలిక  కోచింగ్ సెంటర్ కు వెళ్లి వస్తున్న సమయంలో అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ ఘటన మర్చిపోకముందే ఇటీవలనే  దళిత యువతిపై యాసిడ్ పోసి హత్య చేశారు. ఆ తర్వాత ఆమెను  బావిలో వేశారు.ఈ ఘటనలపై  బీజేపీ  మండిపడింది.  రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయో ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయని  బీజేపీ విమర్శలు చేసింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !