
Bhupesh Baghel: ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. శ్రీ రాముడిని ‘రాంబో’గా, హనుమంతుడిని ‘కోపానికి చిహ్నం’ గా మార్చేందుకు బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని అన్నారు. భారత్లో దూకుడు జాతీయవాద శకానికి తెరపడుతుందని భూపేష్ బఘేల్ అన్నారు. బీజేపీపై వెనక్కి తగ్గకుండా గట్టిగా పోరాడుతున్న ఏకైక నాయకుడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అని బఘేల్ అన్నారు. ప్రజల సమస్యలపై నేరుగా మాట్లాడే ఏకైక వ్యక్తి తానేనన్నారు.
సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బిజెపి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మతాన్ని రాజకీయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఏప్రిల్లో భారతదేశం నలుమూలల నుండి మతపరమైన హింసాత్మక నివేదికలు వచ్చాయని అన్నారు. ఇందులో భిన్నాభిప్రాయాలకు తావు లేదని అన్నారు. ఇవన్నీ ఎక్కువ కాలం ఉండవని, కాంగ్రెస్ మళ్లీ వస్తుందని బఘేల్ అన్నారు.
‘శ్రీ రాముడిని మర్యాద పురుషోత్తముడిగా, ఆదర్శవంతుడిగా మనం విశ్వసిస్తాం. మనం ఎల్లప్పుడూ రామరాజ్యం గురించి ఆలోచిస్తాం. శ్రీ రాముడు మన సంస్కృతిలో ఇమిడి ఉన్నాడు. రాముడు భౌతిక, నిరాకారుడు. కానీ గత కొన్నేండ్లుగా.. రాముడిని రాంబోగా చూపించడానికి ప్రయత్నాలు జరిగాయి. రాముడితోపాటు హనుమంతుడ్ని కూడా కోపంగా చిత్రీకరిస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు’ అని అన్నారు. ప్రతి ఒక్కరికి రాముడి రూపం ఒక్కోలా ఉంటుందన్నారు.
రైతులు ఆయన్ను వేరుగా, గిరిజనులు వేరుగా చూస్తారు. మేధావులు, భక్తులు ఆయనను మరో రూపంలో చూస్తారు. అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “మహాత్మా గాంధీ కూడా తన స్ఫూర్తితో రాముడిని చూశాడు. అతని చివరి మాటలు 'హే రామ్' మరియు అతను రఘుపతి రాఘవ రాజా రామ్ అని పఠించేవారు. కానీ నేడు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాముడిని చూసే విధానం, వారు నిర్దేశిస్తున్న ఎజెండా మర్యాద పురుషోత్తం రామ్ను దూకుడుగా మార్చేశాయి. వాటిని రాంబోగా రూపొందిస్తున్నారు.
కాగా, శ్రీరామ నవమి సందర్భంగా ఏడు రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనలకు బీజేపీనే కారణమని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇటీవల ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ హింసాత్మక ఘటనలపై ఒక కమిటీతో దర్యాప్తు జరిపించాలని సవాల్ చేశారు. అప్పుడు వాస్తవం ఏమిటో తెలుస్తుందని, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. రాజస్థాన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో హింసను రాజేసి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు
బీజేపీపై వెనక్కి తగ్గకుండా గట్టిగా పోరాడుతున్న ఏకైక నాయకుడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అని బఘేల్ అన్నారు. ప్రజల సమస్యలపై నేరుగా మాట్లాడే ఏకైక వ్యక్తి తానేనన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, జిఎస్టి కావచ్చు. బీజేపీపై దాడికి రాహుల్ గాంధీ భయపడడం లేదని అన్నారు.