' వీర సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలి'

Published : Feb 21, 2023, 11:36 PM IST
' వీర సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలి'

సారాంశం

మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం మంగళవారం తొలి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రతిపాదించిన తీర్మానాల్లో హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

శివసేన పేరు, చిహ్నం పోరులో విజయం సాధించిన నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. హోటల్ తాజ్‌లో జరిగిన సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు సమర్పించి ఆమోదించారు. వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కూడా ఇందులో ఉంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక వ్యూహం రచించనున్నారు. ఇందుకోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. దీంతో పాటు చర్చ్‌గేట్‌ రైల్వే స్టేషన్‌కు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చింతమన్‌రావు దేశ్‌ముఖ్‌ పేరు పెట్టాలనే ప్రతిపాదనను కూడా సమావేశంలో ప్రతిపాదించారు.

 ఇతర ప్రతిపాదనలు

 -  రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో భూమి పుత్రులకు, స్థానిక యువతకు 80 శాతం ఉపాధి కల్పిస్తామన్నారు. 
- మరాఠీ భాషకు ఉన్నత (అభిజాత్) భాష హోదా ఇవ్వాలని డిమాండ్ 
- UPSC, MPSC కోసం మరాఠీ విద్యార్థులకు బలమైన మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారు
 
శివసేన అధినేతగా షిండే..

సమావేశం అనంతరం మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌ మాట్లాడుతూ.. 'ఈరోజు సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో సమావేశం నిర్వహించాం. మా శివసేన అధినేతగా ఏక్‌నాథ్ షిండే ఉంటారు. ఆయనను శివసేన నాయకుడిగా అంగీకరించాం. ప్రభుత్వ పనితీరుపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. అలాగే..  'పార్టీపై చర్యలు తీసుకునే వారి కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. ఏక్నాథ్ షిండేకు పార్టీ అధికారాలన్నీ ఉంటాయి. ఈ సమావేశంలో మరాఠీకి ఉన్నత భాషా హోదా ఇవ్వాలని నిర్ణయించారు. 80 శాతం భూమి పుత్రులకు ఉపాధి కల్పించాలని, స్వాతంత్య్ర సమరయోధుడు సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.

ఉద్ధవ్ వర్గం కూడా భారతరత్న డిమాండ్ 

ఆసక్తికరంగా.. ఉద్ధవ్ థాకరే బృందం వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసింది. గత వారం ఎన్నికల సంఘం షిండే వర్గానికి శివసేన పేరు, గుర్తును కేటాయించింది. గత సంవత్సరం షిండే మద్దతుదారుల తిరుగుబాటు నుండి పేరు మరియు చిహ్నంపై దావా వేస్తున్న ఉద్ధవ్ వర్గానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావించబడింది. 78 పేజీల నిర్ణయంలో.. ఎన్నికల సంఘం శాసనసభ సభ నుండి సంస్థ వరకు షిండే వర్గానికి మెజారిటీ ఉందని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu