ప్రధాని మోదీని కలిసిన కమెడియన్ అయ్యో శ్రద్ధా...!

Published : Feb 14, 2023, 11:12 AM ISTUpdated : Feb 14, 2023, 11:17 AM IST
ప్రధాని మోదీని కలిసిన కమెడియన్ అయ్యో శ్రద్ధా...!

సారాంశం

తాజాగా ఆమె ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 

హాస్యనటి శ్రద్ధా జైన్ గురించి తెలిసే ఉంటుంది. ఇటీవల చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగులను విపరీతంగా తొలగించేశాయి. ఈ విషయంపై ఇటీవల ఆమె ఓ వీడియో చేయగా... అది  వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఆమె మరింత ఫేమస్ గా మారింది.  ఆ వీడియోతోనే ఆమె పాపులారిటీ బాగా పెరిగిపోయింది అంటే... తాజాగా ఆమె ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 

 

తన వీడియోలో ఆమె ఎక్కువగా..‘అయ్యో’ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాగా... మోదీ కూడా ఆమెను అయ్యో అంటూ పలకరించారట. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం విశేషం. మోదీతో దిగిన ఫోటోని ఆమె పంచుకున్నారు. మోదీని చూసిన క్షణం తాను రెప్ప కొట్టలేదని ఆమె చెప్పారు.  ఈ సందర్భంగా ఆమె మోదీకి దన్యావాదాలు తెలియజేశారు.

కాగా.. ఆమె మెదీని కలిసిన సమయంలో ఆమెతో పాటు కేజీఎఫ్ హీరో యష్, కాంతారా హీరో రిషభ్ శెట్టి, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ కూడా కలిశారు. ఆ ఫోటోని కూడా ఆమె షేర్ చేశారు.  మోదీని కలిసినందుకు ఆమెకు... నెటిజన్లు  కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. కాగా.. శ్రద్ధా జైన్ కి ఇన్ స్టాగ్రామ్ లో 6లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?