బాబాకా దాబా యజమాని ఆత్మహత్యాయత్నం: సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స

Published : Jun 18, 2021, 03:26 PM IST
బాబాకా దాబా యజమాని ఆత్మహత్యాయత్నం: సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స

సారాంశం

బాబాకా దాబా యజమాని కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు.దీంతో ఆయనను  ఆసుపత్రిలో చేర్పించారు. ఆత్మహాత్యాయత్నం చేసిన కాంత ప్రసాద్ ను గుర్తించిన కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. 

న్యూఢిల్లీ: బాబాకా దాబా యజమాని కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు.దీంతో ఆయనను  ఆసుపత్రిలో చేర్పించారు. ఆత్మహాత్యాయత్నం చేసిన కాంత ప్రసాద్ ను గుర్తించిన కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో కాంత ప్రసాద్ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్ నష్టాల్లో ఉంది. దీంతో ఆయన తిరిగి గతంలో తాన నడిపిన రోడ్డు సైడ్ పాత హోటల్ ను నడుపుకొంటున్నాడు. 

కరోనా కారణంగా ఆదాయం లేక ఇబ్బందిపడుతున్న విషయాన్ని బాబాకా దాబా నడుపుతున్న కాంతప్రసాద్ దంపతుల వ్యధను  ఓ యూట్యూబర్  వెలుగులోకి తెచ్చాడు.  ఈ విషయమై పలువురు  కాంత ప్రసాద్ దంపతులకు సహాయం చేశారు.  దీంతో రూ. 5 లక్షలతో అద్దె స్థలంలో రెస్టారెంట్ ప్రారంభించారు.

ఆరు మాసాల పాటు రెస్టారెంట్ నడిపినా అది సక్రమంగా నడవలేదు. దీంతో కాంత ప్రసాద్ తిరిగి పాత హోటల్ నడుతుపుకొంటున్నాడు. ఈ విషయమై మనోవేదనకు గురైన కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబసభ్యులు చెప్పారు. సఫ్డర్‌జంగ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.  కాంత ప్రసాద్ తనయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu