డిజిటల్ ఇండియా.. అయోధ్యలో ఊపందుకున్న క్యూఆర్ కోడ్ లావాదేవీలు , ఈ మార్పు వెనుక..?

Siva Kodati |  
Published : Dec 30, 2023, 09:43 PM ISTUpdated : Dec 30, 2023, 09:45 PM IST
డిజిటల్ ఇండియా.. అయోధ్యలో ఊపందుకున్న క్యూఆర్ కోడ్ లావాదేవీలు , ఈ మార్పు వెనుక..?

సారాంశం

శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో డిజిటల్ పునరుజ్జీవనం జరుగుతోంది. భారతీయ నాగరికతకు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వున్న ఈ ప్రాంతం సాంకేతిక పురోగతిని చూస్తోంది. కొత్త ప్రగతి శకానికి గుర్తుగా గంభీరమైన శ్రీరామ మందిరానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడంతో నగరం అభివృద్ధి కేంద్రంగా రూపాంతరం చెందింది.   

శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో డిజిటల్ పునరుజ్జీవనం జరుగుతోంది. భారతీయ నాగరికతకు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వున్న ఈ ప్రాంతం సాంకేతిక పురోగతిని చూస్తోంది. కొత్త ప్రగతి శకానికి గుర్తుగా గంభీరమైన శ్రీరామ మందిరానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడంతో నగరం అభివృద్ధి కేంద్రంగా రూపాంతరం చెందింది. 

అయోధ్యలో డిజిటల్ లావాదేవీల పెరుగుదల :

నగర ప్రస్తుత నిర్మాణ విజృంభణలో సరయూ నది వెంబడి విస్తరించిన రోడ్లు, బహుళ స్థాయి కార్ పార్క్‌లు, పునర్నిర్మించిన దేవాలయాలు, మెరుగైన ఘాట్‌లు వున్నాయి. ఈ ట్రాన్స్‌మిషన్ ఒకప్పుడు ప్రశాంతంగా వున్న పట్టణాన్ని మేల్కోల్పడమే కాకుండా డిజిటల్ చెల్లింపుల వైపు గుర్తించదగిన మార్పుతో ఆర్ధిక కార్యకలాపాల్లో పెరుగుదలను కూడా రేకెత్తించింది. అయోధ్య అంతటా డిజిటల్ లావాదేవీలు ప్రబలంగా మారాయి. స్థానిక విక్రేతలు, నివాసితులు ఇది సులభతరం చేసింది. సరయూ నదిలో నావిగేట్ చేసే బోట్‌మెన్ (పడవ నడిపే వ్యక్తులు) నుంచి హనుమాన్ గర్హి వద్ద దుకాణదారులు డిజిటల్ చెల్లింపు పద్ధతులను అవలంభిస్తున్నారు. 

యూపీఐ, క్యూఆర్ కోడ్ , ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా అయోధ్యలో అతుకులు లేని లావాదేవీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నదీ తీరాల వెంబడి వున్న దుకాణదారులు చెల్లింపులను ఆమోదించడానికి క్యూఆర్ కోడ్‌లను స్వీకరించారు. కనక్ భవన్‌లో సాయంత్రం ఆరతి సమయంలోనూ క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు అందజేస్తున్నారు భక్తులు. శ్రీరామ జన్మభూమి మందిర్‌కు కూడా రూ.2 వేలకు పైన వుండే విరాళాలను క్యూఆర్ కోడ్ ద్వారా ఇచ్చేందుకు వీలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. 

డిజిటల్ చెల్లింపుల వైపు అయోధ్య ప్రస్థానం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, డిజిటల్ ఇండియా విజన్ సహా ప్రభుత్వ కార్యక్రమాలకు అనుగుణంగా వుంది. భారత ఆర్ధిక వ్యవస్ధ డిజిటల్ పరివర్తనకు దోహదపడే కేంద్ర పథకాల గురించి మరింత అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్ రావ్ కరద్ డిజిటల్ చెల్లింపు లావాదేవీలలో గణనీయమైన పెరుగుదలను హైలైట్ చేశారు. దీని వార్షిక వృద్ధి రేటు 45 శాతం కాగా.. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీలు 12,020 కోట్లను అధిగమించాయి. నగదు రహిత ఆర్ధిక వ్యవస్ధ వైపు గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. 

జనవరి 23న ప్రజలు శ్రీరాముడిని దర్శించుకునేందుకు అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో అన్ని రకాల సదుపాయాలను కల్పించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు, పర్యాటకులను స్వాగతించడానికి డిజిటల్ కూడా సన్నద్ధమైంది.

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood