దారుణం.. ప్రియుడితో కలిసి మూడేళ్ల కుమార్తెను చంపి, కదులుతున్న రైలు నుంచి విసిరేసిన తల్లి.. ఎక్కడంటే ?

By team teluguFirst Published Jan 20, 2023, 12:38 PM IST
Highlights

ఓ తల్లి తన కూతురు పట్ల కర్కశంగా వ్యవహరించింది. ప్రియుడితో కలిసి మూడేళ్ల కుమర్తెను హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని కదులుతున్న రైలు నుంచి విసిరేసింది. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. 

ఆమె ఐదుగురు పిల్లలకు తల్లి. కానీ కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయారు. దీంతో ముగ్గురు పిల్లలు భర్త దగ్గర ఉంటున్నారు. మరో ఇద్దరు పిల్లలు ఆ మహిళ దగ్గరే ఉంటున్నారు. ఆమె తన ప్రియుడితో జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు గానీ తనతో పాటు ఉంటున్న ఇద్దరు కూతుర్లలో ఒకరిని ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని కదులుతున్న రైలు నుంచి విసిరేశారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్..

ఈ చర్యకు పాల్పడిన నిందితులను సునీత, సన్నీ అలియాస్ మాల్టాగా పోలీసులు గుర్తించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాకు చెందిన సునీతకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె పలు కారణాల వల్ల భర్తతో విడిపోయారు. దీంతో ఇద్దరు పిల్లలు ఆమె దగ్గర, మరో ముగ్గురు పిల్లలు భర్త దగ్గర ఉంటున్నారు. భార్య తన ప్రియుడు సన్నీ, ఇద్దరు పిల్లలతో కలిసి శాస్త్రి నగర్‌లో ఉంటున్నారు. 

అయితే ఈ క్రమంలో సోమవారం, మంగళవారం రాత్రి ఆ మహిళ తన మూడేళ్ల కుమార్తె కిరణ్ ను ప్రియుడి సాయంతో ఇంట్లోనే హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి శ్రీగంగానగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. మంగళవారం ఉదయం 6:10 గంటలకు రైలు ఎక్కారు. రైలు ఫతుహి రైల్వే స్టేషన్ సమీపంలోని కాలువపై ఉన్న వంతెన వద్దకు చేరుకుంది. కదులుతున్న రైలు నుంచి మృతదేహాన్ని కాలువలో పారేయాలని అనుకొని విసిరేసారని శ్రీగంగానగర్ పోలీసు సూపరింటెండెంట్ ఆనంద్ శర్మ తెలిపారు. కానీ మృతదేహం కాలువలో పడకుండా పట్టాలపై పడింది.

అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్..

బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సునీత, సన్నీలను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే ప్రియుడి సాయంతో తన కుమార్తెను హత్య చేసినట్టు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేశారు. 

ఇలాంటి ఘటనే గత నెలలో మహారాష్ట్రలో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఓ కూతురు కన్న తల్లిని హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబ్రాలోని అమృత్ నగర్ ప్రాంతంలో సబా హష్మి అనే 37 ఏళ్ల మహిళ తన ముగ్గురు కూతుర్లతో కలిసి నివసించేది. ఆమె భర్త నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద అరెస్టు అయి రెండు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ముగ్గురు కూతుర్లతో కలిసి ఆమె జీవించేంది.

కారు ఎక్కనని చెప్పినా వినలే.. యూటర్న్ తీసుకొచ్చి మరీ - స్వాతి మలివాల్ కు ఎదురైన ఘటనలో బయటకొచ్చిన వీడియో

జీవనోపాధి కోసం ఆమె ఆ ప్రాంతంలో పిల్లలకు చదువు చెప్పేది. ఆమె బంధువులు కూడా ఆర్థిక సాయం అందించేవారు. అయితే ఆమె కూతుర్లలో 17 ఏళ్ల బాలికకు స్థానికంగా ఉండే ఓ 22 ఏళ్ల యువకుడితో పరిచయం అయ్యింది. అది వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. వీరిద్దరి ప్రేమను హష్మీ తీవ్రంగా వ్యతిరేకించింది.  ఈ క్రమంలో కొన్ని నెలల కిందట ప్రేమికులు ఇద్దరు మరింత దగ్గరయ్యారు. యువకులు అప్పుడప్పుడు రాత్రి సమయల్లో హష్మీ ఇంటికి వచ్చి గడిపేవాడు. డిసెంబర్ 28వ తేదీ  మధ్యాహ్నం సమయంలో కూడా ఆ యువకుడి బాలిక ఇంటికి వచ్చాడు. అయితే దీనిని తల్లి తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఆగ్రహంతో కూతురు, తన ప్రియుడితో కలిసి తల్లిని కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

click me!