Assam Floods: తగ్గని వ‌ర‌ద‌లు.. బ‌డులు, కాలేజీలు మ‌రో 48 గంటలపాటు మూసివేత !

Published : May 19, 2022, 03:01 PM IST
Assam Floods: తగ్గని వ‌ర‌ద‌లు.. బ‌డులు, కాలేజీలు మ‌రో 48 గంటలపాటు మూసివేత !

సారాంశం

Assam Floods updates: అసోంలోని  కాచర్ జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలలను మ‌రో 48 గంట‌ల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇంకా ఆయా ప్రాంతాల్లో వ‌ర‌ద ప్ర‌భావం కొన‌సాగుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది.   

schools and colleges: అసోంలో వరద పరిస్థితులు తీవ్రతరం కావడంతో కాచర్ జిల్లా యంత్రాంగం అన్ని విద్యాసంస్థలు, అత్య‌వ‌స‌రం సేవ‌లు అందించ‌ని  ప్ర‌యివేటు సంస్థలను గురువారం నుండి 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా ఆయా ప్రాంతాల్లో వ‌ర‌ద ప్ర‌భావం కొన‌సాగుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. గురువారం ఉదయం 6 గంటల నుండి అన్ని విద్యా సంస్థలు (ప్రభుత్వ మరియు ప్ర‌యివేటు) 48 గంటల పాటు మూసివేయబడతాయని కాచర్ జిల్లా యంత్రాంగం తెలిపింది. కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు మరియు కొండచరియలు విరిగిప‌డుతూ అసోంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో దాదాపు 4 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. మరోవైపు, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

అసోంలో వరద పరిస్థితి భయంకరంగా కొనసాగుతుండటంతో, నాగావ్ జిల్లాలోని కంపూర్-కతియాటలిని కలిపే రహదారిలో కొంత భాగం వరదలో కొట్టుకుపోయింది. కోపిలి, బోరపాణి నదుల నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతూ ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది.ఇదిలా ఉండగా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదేశాల మేరకు జోర్హాట్ జిల్లా యంత్రాంగం గురువారం వరద ప్రభావిత ప్రాంతాలైన బరాక్ మరియు హఫ్లాంగ్‌లకు ఆహార పదార్థాలను పంపింది. వ‌ర‌ద‌లో చిక్కుకుపోయిన ప్రజలకు సహాయం చేయడానికి సంబంధిత జిల్లా యంత్రాంగం కనీసం 142 సహాయ శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గౌహతి కేంద్రంగా ఉన్న ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం, ఈ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజులు మరింతగా వర్షాలు కురుస్తాయి. 

కాగా, అసోంలో వ‌ర‌ద‌లు విళ‌య తాండ‌వం సృష్టిస్తున్నాయి. ఎడ‌తెరుపు లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, వ‌ర‌ద‌ల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో పలు చోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది. ఇదే స‌మ‌యంలో త్రిపుర, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని దాదాపు 27 జిల్లాల్లోని దాదాపు 6 లక్షల మందికి పైగా వరదల బారిన పడుతున్నారు. Assam Floods వర్షాలు, వరదల కారణంగా 9 మంది మరణించారు.  వేలాది మందిని సహాయ శిబిరాలకు తరలించారు. 

అసోం ముఖ్యమంత్రి హెచ్‌బి శర్మ బుధవారం మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాతో మాట్లాడారు. బరాక్ వ్యాలీకి రోడ్డు మార్గంలో సహాయ సామగ్రిని పంపడంలో సంగ్మా సహాయం కోరాడు. లోయకు వెళ్లే మార్గం మేఘాలయ గుండా వెళుతుందని, అటువంటి పరిస్థితిలో, సహాయక సామగ్రిని తీసుకువెళ్ళే వాహనాలను ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతించాలని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం