బీబీసీని తమపై తిప్పుకోవాలనే..  ఐటీ దాడులపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్  

Published : Feb 16, 2023, 12:08 AM IST
బీబీసీని తమపై తిప్పుకోవాలనే..  ఐటీ దాడులపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్  

సారాంశం

ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఐటీ దాడులను ఖండిస్తూ.. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనతో ఓవైసీ ఏకీభవించారు. బీబీసీ ఇండియాపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రెండో రోజు కూడా కొనసాగాయి.

బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను దాడులపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో పత్రికారంగం ఎంతో కీలకమని అన్నారు. సమాజంలో ప్రెస్ ఫ్రీడమ్ ఉండాలనీ, పత్రికలు ఒకే పార్టీకి అనుకూలంగా ఉంటే.. ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని అన్నారు.

అదేసమయంలో ప్రధానిమోడీపై విరుచుకుపడ్డారు. చైనా పేరు చెప్పాలంటే భారత ప్రధాని భయపడుతున్నారని అన్నారు. గుజరాత్‌లో ఏం జరిగిందో ఎవరు మర్చిపోలేరనీ, రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చైనాపై ప్రధానికి ఉన్న భయం గురించి ఒవైసీ మాట్లాడారు.

ఎల్‌ఏసీ, ఎల్‌ఓసీ గురించి మాట్లాడుతున్నారని, మన భూమిని చైనా ఆక్రమించిందని ఒవైసీ ఆరోపించారు. చైనా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏమైనా చెబుతారా? 64 పెట్రోలింగ్ పాయింట్లలో దాదాపు 36 పాయింట్లలో భద్రత లేదనీ, చైనాకు భారత్ భయపడవద్దని, ఈ అంశంపై ప్రధాని స్పందించాలని అన్నారు.

అలాగే.. ఎమర్జెన్సీ కాలంలో (1975-77) బిజెపికి అనుకూలమైన కథనాలను ప్రసారం చేసినప్పుడూ..  ఆ పార్టీ నాయకులు విదేశీ ప్రసారకర్త బీబీసీని పొగిడారనీ ఒవైసీ మండిపడ్డారు. బిబిసి కార్యాలయాల్లో ఐటి విభాగం దాడులపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

క్రియాత్మక ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని, దాడులను ఖండిస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనతో ఏకీభవిస్తున్నట్లు ఆయన నొక్కి చెప్పారు. బీబీసీపై ఒత్తిడి చేయరాదనీ, నిజం చెబుతుందనే ఆశభావం తనకు ఉందనీ ఖచ్చితంగా అనుకుంటున్నాననీ, బీబీసీపై బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేస్తుందనీ, ఆ దాడులను ఖండిస్తున్నానని అన్నారు.  

BBC ఇండియాకు వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ సర్వే నేడు రెండవ రోజు కొనసాగింది. అధికారులు సంస్థ ఎలక్ట్రానిక్, పేపర్ ఆధారిత ఆర్థిక డేటా కాపీలను తయారు చేస్తున్నారని అర్థమని అన్నారు. భారతదేశంలోని బ్రిటీష్ బ్రాడ్‌కాస్టర్‌కు వ్యతిరేకంగా ఆరోపించిన పన్ను ఎగవేతపై విచారణలో భాగంగా పన్ను శాఖ మంగళవారం ఢిల్లీ, ముంబై కార్యాలయాలలో మీడియా హౌస్‌తో పాటు కనీసం రెండు లింక్డ్ ప్రాంగణాల్లో దాడులు చేశారు.  
 
2019 అయోధ్య తీర్పులో భాగమైన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎస్ అబ్దుల్ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కూడా ఒవైసీ స్పందించారు. గౌరవప్రదమైన గవర్నర్ పదవిలో ఎవరినీ నియమించడంలో రాజ్యాంగపరమైన అడ్డంకి లేదని అన్నారు. కానీ, రిటైర్డ్ జడ్జి పదవిని ఎందుకు స్వీకరించారని ఆశ్చర్యపోయానని అన్నారు. 

భవిష్యత్తులో ఇలాంటి సందేహాలు తలెత్తకూడదనీ, గౌరవనీయమైన రిటైర్డ్ న్యాయమూర్తి ఈ పదవిని ఎందుకు స్వీకరించారో నాకు తెలియదు, ఎందుకంటే న్యాయమూర్తిగా అతనికి ఇల్లు, ప్రతి సౌకర్యాన్ని కేటాయించారు. ఈ ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పాలని అన్నారు. 

జస్టిస్ (రిటైర్డ్) నజీర్ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో భాగంగా ఉన్నారు, ఇది నవంబర్ 2019 లో అయోధ్య (ఉత్తర ప్రదేశ్)లోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. వేరే ప్రదేశంలో మసీదు కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 

  అదే సమంయలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) ఆఫీస్ బేరర్ల ఎన్నికలను పర్యవేక్షించేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావును సుప్రీంకోర్టు నియమించడాన్ని ఒవైసీ స్వాగతించారు. ఇది మంచి విషయమనీ,హెచ్‌సిఎ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని, ఎన్నికలు యథార్థంగా జరిగితే.. మంచి ప్రదర్శన కనబరుస్తున్న హైదరాబాద్ యువ క్రికెటర్లకు అవకాశాలు లభిస్తాయని అన్నారాయన.

PREV
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu