ఆర్టికల్ 35ఏపై సుప్రీం విచారణ... తేడా వస్తే కశ్మీర్ రణరంగమే..ఇంటెలిజెన్స్ హెచ్చరిక

Published : Aug 05, 2018, 01:54 PM IST
ఆర్టికల్ 35ఏపై సుప్రీం విచారణ... తేడా వస్తే కశ్మీర్ రణరంగమే..ఇంటెలిజెన్స్ హెచ్చరిక

సారాంశం

భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని జమ్మూకశ్మీర్‌కు కల్పిస్తోన్న ఆర్టికల్ 35ఏ విషయంలో ప్రతికూల తీర్పు వస్తే ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తాయని ఇంటెలిజెన్స్ వర్గాలు జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి

భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని జమ్మూకశ్మీర్‌కు కల్పిస్తోన్న ఆర్టికల్ 35ఏ విషయంలో ప్రతికూల తీర్పు వస్తే ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తాయని ఇంటెలిజెన్స్ వర్గాలు జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. 1954లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం స్థానికులు తప్పించి భారతీయులెవ్వరూ జమ్మూకశ్మీర్‌లో స్థిర నివాసం ఏర్పరచుకోవడం, ఆస్తులు కోనుగోలు చేయడం చట్ట విరుద్ధం.

ఈ అధికారాలను కల్పిస్తున్న 35ఏను సవాల్ చేస్తూ ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ఈ అధికరణ భారత పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉందని... దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఆస్తిని కలిగివుండటంతో పాటు నివసించే హక్కును ఆర్టికల్ 35 ఏ ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. దీనిని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చేర్చారని.. ఇది రాష్ట్రపతి అధికార పరిధిలోనిది కాదని తెలిపింది.

దీనిని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. జమ్మూకశ్మీర్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లయితే ఆ రాష్ట్రంలో తీవ్ర అలజడి రేగుతుందని.. పౌరులతో పాటు పోలీసులు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు రాష్ట్రప్రభుత్వానికి తెలపడంతో.. రేపు ఏం జరగబోతోందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial