నగల విషయంలో గొడవ.. భార్యను కాల్చి చంపి, భర్త ఆత్మహత్య..

Published : Jun 27, 2023, 12:09 PM IST
నగల విషయంలో గొడవ.. భార్యను కాల్చి చంపి, భర్త ఆత్మహత్య..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఆభరణాల వివాదంతో ఓ వ్యక్తి తన భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్ లోని షికోహాబాద్‌లో సోమవారం మధ్య రాత్రి ఆభరణాల విషయంలో వివాదం తలెత్తడంతో ఓ వ్యక్తి తన భార్యను కాల్చి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. దీపక్ యాదవ్ (30), అతని భార్య శశి యాదవ్ (26) ఆభరణాల విషయంలో గొడవ పడేవారు. ఆదివారం (జూన్ 25) కూడా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

వివాదం సద్దుమణిగేందుకు కుటుంబీకులు జోక్యం చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య హాట్ హాట్ గా చర్చ జరిగింది. ఆ తరువాత కుటుంబీకులు జోక్యం చేసుకోవడంతో.. తాను ఎప్పుడూ భార్యతో పోరాడనని దీపక్ తన సోదరుడికి హామీ ఇచ్చాడు. అయితే సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు ఇంట్లోని ఓ గదిలో నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. 

పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు
ఏమైందోనని పరుగుపరుగున వచ్చి చూసే సరికి శశి మంచంపై శవమై కనిపించింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, దీపక్ మృతదేహం వేరే గదిలో తుపాకీతో కనిపించింది. మరోవైపు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. దీపక్ ఆర్మీలో ఉద్యోగానికి సిద్ధమవుతున్నాడు.

“ఆభరణాల విషయంలో గొడవ పడేవారు. దీనిపై ఆదివారం మరోసారి గొడవ పడ్డారు. నేను దీపక్‌తో మాట్లాడాను, అతను మళ్లీ గొడవ చేయనని హామీ ఇచ్చాడు. గత రాత్రి, తుపాకీ శబ్దం విన్నాం. వారు చనిపోయారని మేం కనుగొన్నాం ”అని దీపక్ సోదరుడు గోవింద్ యాదవ్ చెప్పారు.

“ఇద్దరు చనిపోయారని మాకు కాల్ వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న తరువాత, మంచం మీద ఒక మహిళ చనిపోయి, మరొక గదిలో, ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి తనను తాను కాల్చుకున్నట్లు తెలుస్తోంది. నగల విషయంలో మృతుడు ఒకరితో ఒకరు గొడవపడ్డారని వారి బంధువులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు”అని షికోహాబాద్ సిఓ దేవేంద్ర సింగ్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu