రైల్వే మినిస్టర్ ఉన్న రైలును ఢీకొట్టేందుకు రానున్న మ‌రో రైలు.. ఎందుకంటే ?

Published : Mar 04, 2022, 02:36 PM ISTUpdated : Mar 04, 2022, 03:44 PM IST
రైల్వే మినిస్టర్ ఉన్న రైలును ఢీకొట్టేందుకు రానున్న మ‌రో రైలు.. ఎందుకంటే ?

సారాంశం

రైల్వే ప్రమాదాలు నివారించాలనే లక్ష్యంతో రూపొందించిన కవచ్ రక్షణ వ్యవస్థను పరీక్షించడానికి కేంద్ర రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ట్రైన్లలో ప్రయాణించనున్నారు. వీరద్దరు ఒకే ట్రాక్ పై వచ్చే ఎదురెదురు ట్రైన్లలో ఉండనున్నారు.

ఓ రైలులో కేంద్ర రైల్వే మంత్రి (central railway minister), మ‌రో రైలులో రైల్వే బోర్డు చైర్మ‌న్ (railway board chairman) ఉంటారు. వారిద్ద‌రు ప్ర‌యాణించే రైలులు ఒకే ట్రాక్ పై ద‌గ్గ‌ర‌గా వ‌స్తాయి. ఒక దానిని ఒక‌టి ఒక‌టి ఢీ కొట్ట‌డానికి కొద్ది నిమిషాల ముందే అవి ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. ఏం అర్థం కాలేదు క‌దూ.. ఇది పూర్తిగా చ‌దివితే మీకే అర్థం అవుతుంది. 

రైలు ప్ర‌మాదాలు నివారించాల‌నే ఉద్దేశంతో కొత్తగా ‘క‌వ‌చ్’ అనే రక్షణ వ్యవస్థను రైల్వేస్ లో ప్రవేశపెట్టనున్నారు. దీనిని ట్రాక్ పై ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించేందుకు ఇలా రైల్వే మినిస్ట‌ర్, రైల్వే బోర్డు చైర్మ‌న్ రైళ్ల‌లో ప్ర‌యాణించ‌నున్నారు. సున్నా ప్రమాదాలే ల‌క్ష్యంగా దేశీంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థను రైల్వేల‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. దీని వ‌ల్ల నిర్ణీత దూరంలో అదే ట్రాక్ పై మ‌రో రైలు ఎదురుగా వ‌స్తే ఆటో మెటిక్ గా రైలు ఆగిపోతుంది. 

లోకో పైలెట్  రెడ్ సిగ్నల్ జంప్ చేయ‌డం లేదా ఏదైనా ఇతర లోపాల వ‌ల్ల ట్రైన్ లు ఒక దానిని ఒక‌టి ఢీకొట్టుకునే ప‌రిస్థితి వ‌స్తే ఈ కొత్త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ద్వారా ట్రైన్లు వాటంత‌ట అవే ఆగిపోతాయ‌ని సీనియర్ అధికారులు తెలిపారు. ఇది విజ‌య‌వ‌తంగా అమ‌లులోకి వ‌స్తే అతి త‌క్కువ ఖ‌ర్చుతో దీనిని ప్రవేశ‌పెట్టిన రైల్వేలుగా ఇండియ‌న్ రైల్వేలు నిలుస్తున్నాయ‌ని తెలిపారు. దీనిని ప‌రీక్షించ‌డానికి సనత్‌నగర్-శంకర్‌పల్లి సెక్షన్‌పై సిస్టమ్‌పై ట్రయల్‌లో భాగంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సికింద్రాబాద్‌కు రానున్నార‌ని తెలిపారు. రైల్వే బోర్డు చైర్మ‌న్ కూడా ఇందులో పాల్గొంటార‌ని చెప్పారు. హెడ్-ఆన్ ఢీకొనడం, వెనుక వైపు నుంచి తాకిడి, సిగ్నల్ జంపింగ్ అనే మూడు సందర్భాల్లో సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తాము ప‌రీక్షిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. 

సాధారణంగా ఎప్పుడైనా రైలు అనుమ‌తి లేకుండా వెళ్లిన‌ప్పుడు లేదా స్టాప్ అని సిగ్న‌ల్ వ‌చ్చినా ప‌ట్టించుకోకుండా రైలు క‌దిలినిప్పుడు (SPAD) సిగ్నల్ పంప‌బ‌డుతుంది. అయితే లోకో పైల‌ట్ దానిని గ‌మ‌నించినా, లేక గ‌మ‌నించ‌పోవ‌డం వ‌ల్ల ట్రైన్ ను ఆప‌డంలో విఫ‌లం అయితే ఆటోమేటిక్ బ్రేక్‌ అప్లికేషన్ ద్వారా కవచ్ రక్ష‌ణ వ్య‌వ‌స్థ రైలు వేగాన్ని ఒక్క సారిగా నిలిపివేస్తుంది. ఇది అధిక ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్‌ని ఉపయోగించడం ద్వారా పని చేస్తుంది. 

ఆత్మనిర్భర్ భారత్ కార్య‌క్ర‌మంలో భాగంగా 2022 యూనియన్ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్ ను ప్ర‌క‌టించారు. 2022-23లో భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం 2,000 కి.మీ రైలు నెట్‌వర్క్‌ను స్వదేశీ ప‌రిజ్ఞానంతో ప్రపంచ-స్థాయి టెక్నాల‌జీని కవచ్ కిందకు తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటి వరకు కవాచ్ కింద 1098 రూట్ కి.మీ, దక్షిణ మధ్య రైల్వే యొక్క ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్‌లలో 65 లోకోలలో ప్ర‌వేశ‌పెట్టారు. ఇంకా ఢిల్లీ-ముంబై, ఢిల్లీ హౌరా కారిడార్‌లలో కవచ్‌ను అమలు చేయడానికి ప్రణాళిక‌ను రూపొందించారు. మొత్తం ఈ రూట్ సుమారు 3000 కిలో మీట‌ర్లు ఉంటుంది. 

 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu