మళ్లీ రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన 12 కోచ్ లు.. పశ్చిమ బెంగాల్ లో ఘటన

Published : Jun 25, 2023, 08:46 AM IST
మళ్లీ రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన 12 కోచ్ లు.. పశ్చిమ బెంగాల్ లో ఘటన

సారాంశం

ఒడిశా రైలు ప్రమాదాన్ని దేశ ప్రజలు ఇంకా మర్చిపోక ముందే పశ్చిమ బెంగాల్ లో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో కోచ్ లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ఓ లోకో పైలట్ కు గాయాలు అయ్యాయి. 

పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 12 కోచ్ లు పట్టాలు తప్పాయి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఓండా స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో గూడ్స్ రైలు లోకో పైలట్ కు గాయాలు అయ్యాయి.

ఈజిప్టు ప్రధాని, కేబినేట్ మంత్రులతో ప్రధాని మోడీ భేటీ.. వాణిజ్య సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ..

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో ఈ ప్రమాదం జరిగింది. ఓండా స్టేషన్‌ మీదుగా గూడ్స్‌ రైలు వెళ్తుండగా వెనుక నుంచి మరో గూడ్స్‌ రైలు ఢీకొట్టిందని సంబంధిత వర్గాలు తెలిపినట్టు ‘ఆజ్ తక్’ నివేదించింది. ఈ ఘటనలో 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం తర్వాత ట్రాక్‌లపై కోచ్‌లు చెల్లాచెదురుగా పడిపోయాయి. రైలు ఢీకొన్న సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ప్రమాదానికి కారణమేంటి ? 
ఈ ప్రమాదానికి కారణమేంటి అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు గూడ్స్ రైళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రమాదం కారణంగా ఆద్రా డివిజన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ట్రాక్ లను క్లియర్ చేయడానికి, రైళ్ల సేవలను పునరుద్దరించడానికి రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu