గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఉగ్ర కుట్ర.. మూడు రోజుల్లో రెండో పేలుడు

Published : May 08, 2023, 12:54 PM IST
గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఉగ్ర కుట్ర..  మూడు రోజుల్లో రెండో పేలుడు

సారాంశం

అమృత్‌సర్‌లోని హెరిటేజ్ స్ట్రీట్‌లో సోమవారం ఉదయం మరో పేలుడు సంభవించింది. గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లే మార్గంలో సారాగర్హి సరాయ్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో పేలుడు సంభవించింది.

అమృత్‌సర్‌లోని హెరిటేజ్ స్ట్రీట్‌లో సోమవారం ఉదయం మరో పేలుడు సంభవించింది. గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లే హెరిటేజ్ స్ట్రీట్‌ సమీపంలో పేలుడు సంభవించింది. ఇవాళ జరిగిన పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.  గత రెండు రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో పేలుడు జరిగింది. అయితే.. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని వారు తెలిపారు.

ఉదయం 6:30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ కోసం నమూనాలను సేకరించడం ప్రారంభించారు. రెండు పేలుళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరారు. పేలుళ్లు భక్తులను భయాందోళనలకు గురిచేశాయని, ఈ ఘటనలపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం నాటి పేలుడులో ఒక వ్యక్తి గాయపడగా, కొన్ని భవనాల అద్దాలు దెబ్బతిన్నాయి.

ఇదిలా ఉంటే.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని పొలాల్లో ఓ బ్యాగ్‌లో 4 అనుమానిత హెరాయిన్ ప్యాకెట్లను BSF సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. బ్యాగ్‌ తోపాటు ఇనుప ఉంగరం, చిన్న టార్చ్ కూడా కనుగొనబడింది. ఈ ఘటన తర్వాత భద్రతా బలాగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

 ఆదివారం (మే 7) రాత్రి 10 గంటల సమయంలో అమృత్‌సర్‌లోని డావోకే గ్రామ శివార్లలోని సమీపంలోని పొలాల్లో ఏదో పడిన శబ్దం విన్నామని బిఎస్‌ఎఫ్ జవాన్లు చెప్పారు. ఆ తర్వాత.. సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో BSF బృందం ఓ బ్యాగ్‌లో అనుమానిత హెరాయిన్ (సుమారు 1.5కిలోలు) 4 ప్యాకెట్లను కనుగొన్నారు. బ్యాగుతో పాటు ఇనుప ఉంగరం, చిన్న టార్చ్ కూడా లభ్యమయ్యాయి. సైనికుల బృందం మొత్తం ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.

రెండున్నర లక్షల విలువైన హెరాయిన్ 

గతంలో పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌ చొరబాటుకు ప్రయత్నించింది. ఫిరోజ్‌పూర్‌లో BSF జవాన్లకు అర్థరాత్రి పాకిస్తాన్ నుండి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ శబ్దం వినిపించింది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జవాన్లు రెండున్నర కిలోల హెరాయిన్‌ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ అయిన హెరాయిన్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.12.5 కోట్లు.  ఏప్రిల్ ప్రారంభంలో కూడా..  పాకిస్తాన్ నుండి డ్రోన్ పంపబడింది. భారత సరిహద్దులోకి ప్రవేశించిన డ్రోన్‌ను BSF జవాన్లు కాల్పులు జరిపి జారవిడిచారు. అందులో 3 ప్యాకెట్లు (బ్లింకర్స్‌తో) ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని బరువు 3.2 కిలోలు. 

PREV
click me!

Recommended Stories

Maruti Suzuki S-Presso : మీ శాలరీ రూ.25,000 అయినా సరే.. ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ