
మహారాష్ట్రలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఎవ్వరూ ఊహించని విధంగా శివసేన మాజీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు జాతీయ ఎన్నికల సంఘం షాకిచ్చింది. శివసేన పార్టీ పేరు, పార్టీ గుర్తు విల్లు-బాణం ను ఏక్ నాథ్ షిండే వర్గానికి కట్టబెట్టింది. ఈసీ నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఈసీ కోలుకోని షాకిచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పటి నుంచి ఉద్ధవ్ శిబిరంలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ ఠాక్రే మాట్లాడారు. ఈ పరిణామంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పిస్తూ.. ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయాన్ని ప్రశంసించారు.
ఎన్నికల సంఘం పాలను పాలుగా, నీటిని నీరుగా మార్చిందని, నిన్ననే సత్యమేవ జయతే సూత్రాన్ని అమలు చేసిందని హోంమంత్రి షా అన్నారు. నాతో చేతులు కలిపి, మహారాష్ట్రలోని అన్ని లోక్సభ స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతో మీ పిడికిలి బిగించి, ఉత్సాహంగా భారత్ మాతాకీ జై అని చెప్పండని అన్నారు.
'సీఎం కావడానికి ప్రతిపక్ష పార్టీ కాళ్లు నొక్కేవాడు'
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే పేరును ప్రస్తావించకుండా.. హోం మంత్రి షా మాట్లాడుతూ.. “కొందరు ముఖ్యమంత్రి కావడానికి ప్రతిపక్ష పార్టీ కాళ్ళు నొక్కుతున్నారు. షిండే సాహెబ్కి నిజమైన శివసేన వచ్చింది. కొంతమంది అబద్ధాలు చెప్పేవారు. పార్టీ కార్యకర్తలను మోసం చేసి కొందరు సీఎం అయ్యారు. మేము షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ల నాయకత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ప్రభుత్వం ఏర్పడుతుంది." అని పేర్కొన్నారు.
కాంగ్రెస్పై అమిత్ షా విమర్శలు
గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హోంమంత్రి మాట్లాడుతూ.. ప్రతి మంత్రి తనను తాను ప్రధానమంత్రిగా భావించే ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వమని, ఏ మంత్రి అయినా తనని తాను ప్రధానిని ప్రధానిగా పరిగణించుకున్నారని అన్నారు.అప్పట్లో పాకిస్థాన్ నుంచి చొరబాటుదారులు చొరబడి మన సైనికుల తలలు ఎత్తుకెళ్లేవారని, ఢిల్లీ కోర్టులో నిశబ్ధం నెలకొందని, ఒకప్పుడు భారత ప్రధాని విదేశాలకు వెళ్లేటప్పుడు తప్పుడు ప్రసంగాలు చేసేవారని విమర్శించారు.
'నరేంద్ర మోదీ లాంటి నాయకుడిని మనం చూడలేం'
అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ.. ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా.. ఆ రాష్ట్రంలో తాను కూడా ఓ కార్యకర్తలా మోడీ జీ కష్టపడి పనిచేస్తారని హోంమంత్రి షా అన్నారు. ప్రధాని మోడీ ప్రజా నాయకుడని పేర్కొన్నారు. ఉరీ, పుల్వామా ఘటనల సమయంలో మోదీ నిర్భయ కమాండర్లా నిర్ణయం తీసుకున్నారనీ, నరేంద్ర మోదీ లాంటి నాయకుడిని గతంతో ఎప్పుడూ మనం చూడలేదనీ, ప్రధాని అయ్యాక నేటికీ మోదీ 15 నుంచి 18 గంటల పాటు పనిచేస్తున్నారని, మోడీ లాంటి నాయకుడు మనకు లభించడం మన అదృష్టమని పేర్కోన్నారు.