Amit Shah: వారి సంఖ్యను ఉద్దేశపూర్వకంగానే పెంచారు.. కులాల సర్వేపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Published : Nov 06, 2023, 05:54 AM IST
Amit Shah: వారి సంఖ్యను ఉద్దేశపూర్వకంగానే పెంచారు.. కులాల సర్వేపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

సారాంశం

Amit Shah : బీహార్ సర్కార్ చేపట్టిన కులాల సర్వేపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సర్వేను ఆధారంగా సీఎం నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. కుల ఆధారిత సర్వేను ఉద్దేశపూర్వకంగా చేపట్టిందన్నారు.

Amit Shah: బీహార్ లోని నితిష్ కుమార్ సర్కార్ చేపట్టిన కులాల సర్వేపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం కుల ఆధారిత సర్వేలో ఉద్దేశపూర్వకంగా ముస్లింలు, యాదవుల జనాభా పెరిగినట్టు చూపిస్తోందని ఆరోపించారు. ముజఫర్‌పూర్‌లోని పటాహిలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రి అమిత్  షా మాట్లాడుతూ..   సిఎం నితీష్ కుమార్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు బీహార్‌లో కుల గణనను నిర్వహించాలని నితీష్ కుమార్ ఎన్‌డిఎ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్)లో భాగంగా ఉన్నప్పుడే ఈ  నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కులాలా లెక్కలకు బీజేపీ వ్యతిరేకంగా కాదన్నారు 

గత ఏడాది జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల మహా కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమిపై  మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పిస్తూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించడమే ప్రతిపక్ష కూటమి.. ప్రధాన, ఏకైక ఎజెండా అని హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.  సీఎం నితీష్ కుమార్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, అది అసలు నెరవేరడం లేదని కేంద్ర హోంమంత్రి అన్నారు. ఆయన (నితీష్)ని భారత కూటమికి కన్వీనర్‌గా కూడా చేయలేదని  ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని మొత్తం 40 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు అమిత్ షా 

బీహార్‌లో గూండాయిజాన్ని తిరిగి రావడానికి నితీష్‌ కారణమని, వెనుకబడిన ప్రజలను లాలూ-నితీష్‌ కుమార్‌ ద్వయం ఎప్పుడూ అవమానిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం నిర్వహించిన కులాలవారీ సర్వే ఫలితాలు గత నెలలో బహిర్గతమయ్యాయి. సర్వే ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ఓబీసీ, ఈబీసీలు 60 శాతానికి పైగా ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu