Nirbhaya case : దోషులు తీహార్ జైలుకు,త్వరలోనే ఉరి?

Published : Dec 10, 2019, 02:27 PM ISTUpdated : Dec 10, 2019, 02:32 PM IST
Nirbhaya case : దోషులు తీహార్ జైలుకు,త్వరలోనే ఉరి?

సారాంశం

నిర్భయ కేసు దోషులను తీహార్ జైలుకు తరలించారు పోలీసులు 

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు నిందితులను తీహార్ జైలుకు తరలించారు. దోషులను త్వరలోనే ఉరి తీస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో  వారిని తీహార్ జైలుకు తరలించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ కేసులో  దోషిగా ఉన్న వినయ్‌ మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్ ఇటీవలనే తిరస్కరించారు. ఈ ఘటనతో నిందితులకు ఉరి తీసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

మెర్సీ పిటిషన్ రద్దు చేసిన 14 రోజుల తర్వాత  నిందితులను ఉరి తీయాలనేది నిబంధన. ఈ కేసులో వినయ్ మినహా తర్వాత ముగ్గురు నిందితులను ఉరితీయాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నాయి. అయితే వినయ్‌కు మాత్రం మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.

Also read:ఆ జైలులో ఉరి తాళ్ల తయారి: నిర్భయ నిందితుల కోసమేనా

ఈ కేసులో దోషులు ఎవరూ కూడ క్షమాబిక్ష కోసం ఎవరూ కూడ మెర్సీ పిటిషన్ దాఖలు చేయలేదు. మెర్సీ పిటిషన్‌పై  తిరస్కరణకు గురైన 14 రోజుల తర్వాత ఉరి తీయాలి. ఈ కేసులో నిందితుడుగా ఉన్న అక్షయ్ ఠాకూర్  సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.గతంలో ఇదే కేసు విషయమై వినయ్ కుమార్, ముఖేష్ సింగ్, పవన్ గుప్తాలు  రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు.. ఈ పిటిషన్లను గతంలో రివ్యూ పిటిషన్లను కొట్టేశారు.  

అక్షయ్ కుమార్ ఠాకూర్ సుప్రీంకోర్టులో  ఈ నెల 8వ తేదీన రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.నిర్భయపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఆరుగురు నిందితులకు 2012 డిసెంబర్ 16వ తేదీన దోషులుగా తేల్చారు. 
 

PREV
click me!

Recommended Stories

పెట్రోల్ కు రేషన్... ఒక్క వాహనానికి నెలకు ఇంతే..!
దేశ రాజధానిలో TV9 WITT సమ్మిట్‌.. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ