కూలిన ఐఎఎఫ్‌ ఎఎన్-32 ఫ్లైట్ : 13 మృతదేహాలు వెలికితీత

Published : Jun 13, 2019, 06:05 PM IST
కూలిన ఐఎఎఫ్‌ ఎఎన్-32 ఫ్లైట్ : 13 మృతదేహాలు వెలికితీత

సారాంశం

అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిన ఎఎన్ 32 విమాన ప్రమాద స్థలం నుండి 13 మృతదేహాలను వెలికితీశారు. కూలిన విమానం బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు.


ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిన ఎఎన్ 32 విమాన ప్రమాద స్థలం నుండి 13 మృతదేహాలను వెలికితీశారు. కూలిన విమానం బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని లిపోకి 16 కి.మీ దూరంలో భారత వైమానిక దళానికి చెందిన ఎఎన్-32 విమానం కూలిపోయింది. ఈ విమానం శకలాలను ఎంఐ-17 విమానాలు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబసభ్యులకు కూడ సమాచారం  ఇచ్చారు.  హెలికాప్టర్ల ద్వారా మృతదేహాలకు స్వస్థలాలకు తరలించనున్నారు.

ఈ నెల 3వ తేదీన ఐఎఎఫ్ ఎఎన్-32 విమానం టేకాఫ్ అయిన 33 నిమిషాల అనంతరం కూలిపోయింది. అస్సాంలోని జొర్హాత్ నుండి మధ్యాహ్నం 12.27 గంటలకు టేకాఫ్ అయిన విమానం అదృశ్యమైంది. ఈ విమానం కూలిపోయిందని రెండు రోజుల క్రితం గుర్తించారు.  

 మారింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌లు గల్లంతైన విమానం కోసం అటవీ ప్రాంతంల్లో జల్లెడపట్టాయి. సంఘటన స్థలం నుండి  మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu