దళితుడిపై దాడి... నగ్నంగా చేసి ఊరేగింపు..

Published : Jun 13, 2019, 08:41 AM IST
దళితుడిపై దాడి... నగ్నంగా చేసి ఊరేగింపు..

సారాంశం

దేశం ఒకవైపు అభివృద్ధి వెంట పరగులు తీస్తుంటే... మరోవైపు ఇప్పటికీ కులాలు, కట్టుబాట్లు పేరిట అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. ఇలాంటి మరో సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దేశం ఒకవైపు అభివృద్ధి వెంట పరగులు తీస్తుంటే... మరోవైపు ఇప్పటికీ కులాలు, కట్టుబాట్లు పేరిట అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. ఇలాంటి మరో సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుడికి సమీపంలో సేద తీరాడనే కారణంతో ప్రతాప్ అనే ఓ దళితుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు.  ఆ యువకుడిని నగ్నంగా మార్చేశారు. అనంతరం కొబ్బరి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు.  ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని మద్రాహళి ప్రాంతంలో చోటుచేసుకుంది.

కాగా.... దళితుడు అనే కారణంతో ప్రతాప్ అనే యువకుడి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని అతని కుటుంబసభ్యులు తప్పుపట్టారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ...  యువకుడి కుటుంబసభ్యులు, బంధువులు అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు.

ప్రతాప్ బంధువులు మాట్లాడుతూ.... గత కొంతకాలంగా ప్రతాప్  మతిస్థిమితం సరిగా లేదు. కాగా... ఇటీవల ఇంట్టో నుంచి పరారైన అతను ఓ గుడికి సమీపంలో నిద్రిస్తున్నాడు. అతను గుడిలోకి అడుగుపెట్టడంతో... ఆలయం అపవిత్రం అయ్యిందంటూ ఆ గుడి పూజారాి నానా హంగామా చేశారు. ఈ విషయం మరికొందరికి తెలియజేయడంతో వారంతా కలిసి... అతని శరీరంపై దుస్తులను తొలగించారు. అనంతరం చెట్టుకు కట్టేసి దాడి చేశారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్టు  చేయడం గమనార్హం.

ప్రతాప్ బంధువుల ఆందోళనతో పోలీసులు దిగి వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu