Akhilesh Yadav Exclusive: బీజేపీని ప్రజలు అధికారం నుంచి తరిమికొడతారు.. అఖిలేష్ యాదవ్

Published : Feb 16, 2022, 11:10 AM ISTUpdated : Feb 16, 2022, 11:15 AM IST
Akhilesh Yadav Exclusive: బీజేపీని ప్రజలు అధికారం నుంచి తరిమికొడతారు.. అఖిలేష్ యాదవ్

సారాంశం

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అధికారంలో నుంచి గద్దె దింపుతారని  సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. సమాజ్ వాదీ పార్టీ కూటమి యూపీలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అధికారంలో నుంచి గద్దె దింపుతారని  సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. సమాజ్ వాదీ పార్టీ కూటమి యూపీలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ పార్టీ సమాజ్ వాద్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఏషియానెట్ న్యూస్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీపై, యోగీపై విమర్శలు గుప్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు యూపీ అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్‌ అవుతందా అని ప్రశ్నించగా.. ప్రధాని, హోంమంత్రి సహా బీజేపీ నేతలంతా యూపీలో ప్రచారం నిర్వహిస్తున్నార.. ఇక్కడ ఓడిపోతే కేంద్రంలో ఓడిపోతామని బీజేపీకి తెలుసని అఖిలేష్ వ్యాఖ్యానించారు. అయితే యూపీ ప్రజలు ఈసారి బీజేపీని అధికారం నుంచి తరిమికొడతారని చెప్పారు.

సమాజ్ వాదీ పార్టీ పూర్తి మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెస్ మద్దతు తీసుకుంటుందా అని ప్రశ్నించగా.. కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల మద్దతును అంగీకరించాల్సిన అవసరం ఉండదని అఖిలేష్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీ కూటమికి అధికారం చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించేందుకు సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేస్తోందని అఖిలేష్ తెలిపారు. సమాజ్ వాదీ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఎస్పీ పోటీ పడుతుండగా.. సమాజ్ వాదీ పార్టీని ఓడించడమే బీఎస్పీ లక్ష్యమని విమర్శించారు. "

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిన్న కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.. ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందా అని ప్రశ్నించగా.. దీనిపై ఇప్పుడే స్పందించడం చాలా తొందరపాటు అవుతుంది.. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి అని అన్నారు.

హిందూ, ముస్లిం మతతత్వాన్ని రెచ్చగొట్టడం, హింసను ప్రేరేపించడం మాత్రమే యోగికి తెలుసని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీ కంటే కేరళ హెల్త్‌తో పాటు ఇతర అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తుడిచిపెట్టేస్తారని అఖిలేష్ చెప్పారు. యూపీలో రెండో దశ పోలింగ్ ముగిసింది.. బీజేపీని ఓడించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. అందరూ సైకిల్ గుర్తుకే (సమాజ్ వాదీ పార్టీ గుర్తు) ఓటు వేస్తున్నారని అన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. 

బీజేపీ నేతలు అభివృద్ధి గురించి మాట్లాడడం లేదన్నారు. వాళ్లు కేవలం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూపీ ఆరోగ్య రంగంతో పాటుగా ఇతర రంగాలలో  కూడా కేరళ కంటే వెనుకబడి ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసిందని విమర్శించారు. హామీలను నెరవేర్చకపోవడంతోనే మాటల దాడికి దిగుతున్నారని ఎద్దేవా చేశారు.

దళిత వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చారు... కానీ ప్రస్తుతం రైతుల పరిస్థితి చూస్తే ఏ విధంగా అన్యాయం చేశారనే అర్థమవుతుందన్నారు. రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు.

‘జ్యుడీషియల్ కమిషన్ జాబితాలో కేరళ అగ్రస్థానంలో ఉంది. ఆరోగ్యం, విద్యలో కేరళ ముందంజలో ఉంది. ఉపాధి పరంగా యూపీ కంటే ముందుంది. యూపీ ముఖ్యమంత్రికి ఎవరితో పోల్చాలో కూడా తెలియడం లేదు. హిందూ-ముస్లిం మతతత్వాన్ని వ్యక్తీకరించడం, హింసను ప్రేరేపించడం, కుల సమస్యలను ప్రేరేపించడంపై ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి కల్పించలేక, ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచలేక, పెట్టుబడులు తీసుకురాలేకపోయింది. రైతులకు ఎలాంటి సాయం అందలేదు. యూపీలో విద్యుత్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేస్తామన్న హామీతో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికలను ఎదుర్కొంటుంది’ అని అఖిలేష్ అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

విజయ సంకల్ప యాత్రలో మోదీ స్పీచ్ కి దద్దరిల్లిన సభ | PM Narendra Modi Speech | Asianet News Telugu
PM Narendra Modi Speech in Dum Dum: వెస్ట్ బెంగాల్ సభలో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu