ఊరట: చిదంబరాన్ని జూలై 10 వరకు అరెస్ట్ చేయొద్దు: కోర్టు

First Published Jun 5, 2018, 11:08 AM IST
Highlights

చిదంబరానికి ఉపశమనం

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర ఆర్ధికశాక మంత్రి పి. చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో జూలై 10వ తేది వరకు అరెస్ట్ చేయవద్దని న్యూఢిల్లీ కోర్టు ఈడీని ఆదేశించింది.


మంగళవారం నాడు ఉదయమే న్యూఢిల్లీ  కోర్టు ఈ మేరకు ఈడీని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది.జూలై 10వ తేది నాటికి  ఈ సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు అదే రోజున తదుపరి విచారణను చేయనున్నట్టు కోర్టు ప్రకటించింది.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం  ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో చిదంబరానికి కోర్టు నుండి ఉపశమనంలభించింది.

 

click me!