పర్సు దొంగతనం చేసిన ఎయిరిండియా పైలట్, సస్పెన్షన్

Siva Kodati |  
Published : Jun 24, 2019, 10:44 AM IST
పర్సు దొంగతనం చేసిన ఎయిరిండియా పైలట్, సస్పెన్షన్

సారాంశం

పర్సు దొంగతనం కేసులో పైలట్‌ను ఎయిరిండియా సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. సిడ్నీ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఏఐ-301 విమానంలో పైలట్ రోహిత్.. ఆయన ఎయిరిండియా రీజనల్ డైరెక్టర్‌గా కూడా పని చేస్తున్నారు. 

పర్సు దొంగతనం కేసులో పైలట్‌ను ఎయిరిండియా సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. సిడ్నీ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఏఐ-301 విమానంలో పైలట్ రోహిత్.. ఆయన ఎయిరిండియా రీజనల్ డైరెక్టర్‌గా కూడా పని చేస్తున్నారు.

ఈ నెల 22వ తేదీ ఉదయం విమానం సిడ్నీ నుంచి బయలుదేరే ముందు రోహిత్ ఈ దొంగతనం చేశారని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ఉన్న దుకాణం నుంచి ఆయన ఒక పర్సు దొంగిలించారని.. దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని, నిజమని తేలడంతో రోహిత్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

విమానం ఢిల్లీలో దిగగానే విమానాశ్రయంలోనే రోహిత్‌కు సస్పెన్షన్‌ ఉత్తర్వులు అందజేశామని, గుర్తింపు కార్డుని అధికారులకు అప్పగించాలని.. తమ అనుమతి లేకుండా రోహిత్ నివాస స్థలమైన కోల్‌కతాను విడిచి వెళ్లరాదని కూడా ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

పేద విద్యార్థుల సక్సెస్ స్టోరీ లో సర్కాార్.. ఇది కదా పాలనంటే..
Travel Guide : తెల్లని ఇసుక, రంగురంగుల పగడపు దిబ్బలు.. ఆసియాలోనే అందమైన బీచ్ మన దక్షిణాదిదే.. ఈ ప్రాంతం భూతల స్వర్గమే