
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్లో ఎయిరిండియా బోయింగ్ విమానంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విమానంలో లోపాలను సరిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం వాటిల్లింది.
ఢిల్లీ నుండి శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లే ఎయిరిండియా ( బోయింగ్ 777) విమానంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విమానంలోని పవర్ సెంటర్లో మరమత్తులు చేస్తున్న సమయంలో అగ్నిప్రమాదం వాటిల్లింది.
ఈ ఘటన బుదవారం అర్ధరాత్రి చోటు చేసుకొంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ప్రయాణీకులు ఎవరూ కూడ లేరని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
ఈ ఘటనకు సంబంధించి ఎయిరిండియా గురువారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది. బోయింగ్ 777 విమానాన్ని సాధారణ తనిఖీలు చేసే సమయంలో
ఈ ప్రమాదం వాటిల్లిందని ప్రకటించింది.