తప్పిన పెను ప్రమాదం.. గోడను ఢీకొట్టి ఎగిరిన ఎయిర్ ఇండియా విమానం

sivanagaprasad kodati |  
Published : Oct 12, 2018, 12:02 PM IST
తప్పిన పెను ప్రమాదం.. గోడను ఢీకొట్టి ఎగిరిన ఎయిర్ ఇండియా విమానం

సారాంశం

తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.. తిరుచ్చి నుంచి దుబాయ్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) ప్రహరీ గోడను ఢీకొట్టి వెళ్లిపోయింది. 

తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.. తిరుచ్చి నుంచి దుబాయ్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) ప్రహరీ గోడను ఢీకొట్టి వెళ్లిపోయింది.

ఆ సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు... గోడను ఢీకొట్టినట్లు గుర్తించిన పైలట్లు విమానాన్ని ముంబైకి దారి మళ్లీంచారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు.

ఈ ఘటనలో విమానం చక్రాలు, యాంటీనా ధ్వంసమయ్యాయి. మరోవైపు గోడకు ఢీకొట్టిన తర్వాత కొంతసేపు విమానానికి ఏటీసీ సిగ్నల్స్‌తో సంబంధాలు తెగియపోయాయి. ఈ ప్రమాదం సాంకేతిక కారణాల వల్ల జరిగిందా..? లేక పైలట్ల తప్పిదమా అన్న దానిపై ఎయిరిండియా దర్యాప్తునకు ఆదేశించింది. ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికులను మరో విమానంలో దుబాయ్ తరలించినట్లుగా అధికారులు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu