AIMIM Chief Asaduddin Owaisi: RSS చీఫ్ వ్యాఖ్య‌ల‌పై అసదుద్దీన్ ఒవైసీ కౌంట‌ర్

Published : Jul 14, 2022, 03:48 PM IST
AIMIM Chief Asaduddin Owaisi: RSS చీఫ్ వ్యాఖ్య‌ల‌పై అసదుద్దీన్ ఒవైసీ కౌంట‌ర్

సారాంశం

AIMIM Chief Asaduddin Owaisi: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటనపై ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ధీటుగా సమాధానం ఇచ్చారు. తాను జనాభాపై ఎక్కువగా మాట్లాడుతానని, నిరుద్యోగం గురించి మాట్లాడలేదన్నారు.  

AIMIM Chief Asaduddin Owaisi: గ‌త కొద్ది రోజుల క్రితం UN వెల్ల‌డించిన నివేదికల ప్ర‌కారం భార‌త్ జనాభా పరంగా చైనాను వెనుకకు నెట్టివేస్తుంద‌ని పేర్కొంది. అప్పటి నుంచి ఈ అంశంపై దేశ నేతల్లో చర్చ జోరందుకుంది. నిన్న జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. మ‌నం తీసుకునే ఆహారం, జనాభా పెర‌గ‌డంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ వ్యాఖ్య‌ల‌పై హైదరాబాద్ ఎంపీ, AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ దుమ్మెత్తి పోశారు. రాజ్యాంగాన్ని చదవమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్‌కు సలహా కూడా ఇచ్చారు. జనాభా అంశాన్ని భగవత్ వివాదాస్ప‌దంగా మార్చార‌నీ, అయితే.. ఉపాధి గురించి ఎందుకు మాట్లాడరని ఒవైసీ అన్నారు.

జనాభా విషయంలో.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చేసిన ప్రకటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చాలా సీరియస్ అయ్యారు. దేశంలో ఎనిమిది శాతం నిరుద్యోగం ఉందన్నారు. భగవత్ జనాభా గురించి మాట్లాడతారు, కానీ నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడరు? అని ప్ర‌శ్నించారు.  ఉపాధిపై ఎందుకు మాట్లాడరు? మన దేశం యువతదేనని ఒవైసీ అన్నారు. దేశంలో జనాభా గురించి మాట్లాడి.. ఒక వర్గంపై ద్వేషం పెంచకుండా.. యువత ఉపాధి కోసం ప్రభుత్వం కృషి చేయాలి.

ఈ సందర్భంగా ఒవైసీ మతమార్పిడి అంశంపై కూడా మాట్లాడారు. దేశంలో ఒకే సంస్కృతి ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ మాట్లాడుతుందని, అయితే హిందూత్వం, భారతీయత రెండూ ఒకేలా ఉండవని వారికి తెలియదన్నారు. భారతదేశం అనేక మతాల‌కు కేంద్రం. ఎవరైనా మతం మారాలనుకుంటే.. రాజ్యాంగ‌ప‌రంగా ఇష్టం వ‌చ్చిన‌ట్టు మతం మారవ‌చ్చు. కానీ, భగవత్ దానికి ఎందుకు భయపడుతున్నారు. దేశంలో ఒకే భాష, ఒకే భాష ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ కోరుకుంటోందని, అయితే భాష ముఖ్యం కాదని, భావోద్వేగం ముఖ్యమని అన్నారు.

సంఘ్ తన భావజాలాన్ని దేశంపై రుద్దాలని భావిస్తోందని, అయితే.. అలా చేయడం సాధ్యం కాదని ఒవైసీ అన్నారు. దక్షిణ భారత సంస్కృతిని ఉత్తర భారతదేశంపై రుద్దవచ్చా? అని ప్ర‌శ్నించారు. ఎన్నికల హక్కు భారత రాజ్యాంగంలో ఉంది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారిని బలోపేతం చేయాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉందని, వారిని అభివృద్ధికి  కృషి చేయాలని ఒవైసీ మోహన్ భగవత్‌కు సూచించారు. ఇది భారత రాజ్యాంగంలోని సత్యం, దీనిని వారు అంగీకరించాలని అన్నారు.

విషయం ఏమిటి? 

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలోని ముద్దెనహళ్లిలో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ స్నాతకోత్సవంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ మాట్లాడుతూ.. జనాభాపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మనిషికి తెలివితేటలు లేకపోతే.. భూమిపై అత్యంత బలహీనమైన జీవి అయి ఉండేవాడు, కానీ.. జ్ఞాన ప్రేరణ మనిషి జీవితంలోకి వచ్చి.. అత‌న్ని ఉత్తమంగా మార్చింది.  ఎవరు శక్తిమంతుడు? ఇది అడవి చట్టం.. కానీ మానవుల భాష్యం ఏమిటంటే ? ఇతరులకు జీవించడానికి సహాయం చేస్తాడు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు