అసోంలో భయపెడుతున్న మరో వైరస్: రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

Published : Sep 24, 2020, 10:32 AM IST
అసోంలో భయపెడుతున్న మరో వైరస్: రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

సారాంశం

: దేశంలో కరోనాతో పాటు మరో వైరస్ కూడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పందుల ద్వారా ఈ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను ఆదేశించింది.  


దేశంలోని అసోం రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది. ముజులి, గోలఘాట్, కమ్రూప్ మెట్రోపాలిటన్ సిటీల వరకు వ్యాప్తి చెందింది.

అసోంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఈ వైరస్ ప్రభావం ఉన్నట్టుగా నిపుణులు గుర్తించారు.

అసోం రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బారినపడిన 12 వేల పందులను చంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే పందుల పెంపకందారులను ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. పందుల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించనుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 18 వేల పందులు మృత్యువాతపడ్డాయి.

పశు సంవర్థక శాఖాధికారులతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శర్వానంద్ సోనేవాల్ అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించారు.  రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ జిల్లాల్లో పందులను చంపేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. 

2019 నాటికి అసోంలో మొత్తం 21 లక్షల పందులను చంపేశారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇక ప‌ని అయిపోంది అనుకున్న స‌మ‌యంలో పీకే వండ‌ర్‌.. ప్ర‌శాంత్ కిశోర్ గెలుపు అస‌లు కార‌ణ‌లేంటి?
బీహార్‍లో బీజేపీకి షాక్.. కమలం ఓడిపోవడానికి కారణమిదే | Prashant Kishor | Bihar By Election Result