Madhavan: కేన్స్ వేదికగా ప్రధాని మోడీపై న‌టుడు మాధవన్ ప్రశంసలు

Published : May 20, 2022, 04:47 PM IST
Madhavan: కేన్స్ వేదికగా ప్రధాని మోడీపై న‌టుడు మాధవన్ ప్రశంసలు

సారాంశం

Actor Madhavan: కేన్స్  వేదికగా ప్రపంచంలో మైక్రో ఎకానమీకి సంబంధించి ఎక్కువ వినియోగదారులున్న దేశాల జాబితాలో భారత్  నిలిచిందనీ, అదే మన నవభారతమని పేర్కొంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై న‌టుడు ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌శంస‌లు కురిపించారు. 

PM Modi's digital economy: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ పై సినీ నటుడు ఆర్. మాధవన్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ డిజిటల్ ఎకానమీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని తెలిపారు. ఆర్థిక సంఘం అది విపత్తుగా మారుతుందని భావించిందని అన్నారు. అయితే ఫోన్‌ను ఉపయోగించేందుకు సామాన్య ప్ర‌జానీకానికి,  రైతులకు  చదువు వచ్చవుండాల్సిన అవసరం లేదని అన్నారు.  ప్ర‌పంచం వ్య‌క్తం చేసిన అనుమానాలన్నీ రెండేళ్లలోనే పటాపంచలయ్యాయని, కథ మారిపోయిందని ప్ర‌ధాని మోడీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. 

వివ‌రాల్లోకెళ్తే.. నటుడు ఆర్ మాధవన్ గురువారం కేన్స్‌లో తన దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఈ ఏడాది కేన్స్‌లో చేరిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ప్రధాని మోదీ డిజిటల్ ఎకానమీ దృష్టిని ఆర్థికవేత్తలు విపత్తుగా ఎలా భావించారో మాధవన్ వివరిస్తూ వీడియోను పంచుకున్నారు. రైతులకు ఫోన్‌ను ఉపయోగించేందుకు అవగాహన అవసరం లేదని అన్నారు."భారత ప్రధాని మోడీ తన పదవీకాలం ప్రారంభించినప్పుడు, అతను మైక్రో ఎకానమీ మరియు డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఇది పని చేయ‌దు.. ఇది విప‌త్తుకు దారి తీస్తుంద‌ని అనుమానం వ్య‌క్తం చేసింది. ఆ ప్రపంచమే ఇప్పుడు అబ్బుపడేలా సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ విజయం సాధించిందని చెప్పారు. ఆ అనుమానాలన్నీ రెండేళ్లలోనే పటాపంచలయ్యాయని, కథ మారిపోయిందని చెప్పుకొచ్చారు. 

ప్ర‌ధాని మోడీ తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణ‌గా ప్ర‌పంచంలోనే మైక్రో ఎకానమీకి సంబంధించి ఎక్కువ వినియోగదారులున్న దేశాల జాబితాలో భారత్ నిలిచిందన్నారు. అదే మన నవభారతమంటూ పేర్కొన్నారు. ఓ రైతు ఫోన్ ను వాడాలంటే చదువే వచ్చి ఉండాల్సిన అవసరం లేదని ప్ర‌ధాని నిర్ణ‌యాలే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. 

మాధవన్ తన సినిమా గురించి మాట్లాడుతూ "ఆర్యభట్ట నుండి సుందర్ పిచాయ్ వరకు, సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించినంతవరకు మనకు చాలా అసాధారణమైన కథలు ఉన్నాయి. మేము వాటి గురించి సినిమాలు చేయడం లేదు, అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు స్ఫూర్తి. నటీనటుల కంటే వారికే అధికంగా అభిమానులున్నారు" అని తెలిపారు.ఆర్‌. మాధ‌వ‌న్ నిర్ధేశ‌క‌త్వంలో తెర‌కెక్కిన రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్ కేన్స్‌లో గురువారం ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుండ‌గా మాధ‌వ‌న్ మాట్లాడుతూ భార‌త్ కొన్ని అసాధార‌ణ క‌థలను ప్ర‌పంచం ముందుంచాలన్నారు. మాధవన్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu