గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన తప్పిపోయిన పదహారేళ్ల బాలిక మృతదేహమై కనిపించింది. పదహారేళ్ల బాలిక శవ పరీక్ష నివేదికలో దుండగులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. అంతేకాదు పోస్టుమార్టం చేసిన వైద్యులు ఓ భయంకర నిజాన్ని తెలుసుకుని షాక్ కు గురయ్యారు. ఆమె మీద అత్యాచార యత్నం చేసి, చంపేయడమే కాకుండా ఆమె మరణించిన తర్వాత కూడా బాలిక మృతదేహంపై నిందితులు అత్యాచారం కొనసాగించారని పోస్టుమార్టంలో తేలింది.
రాజస్థాన్ : ఆడపిల్లలపై ఆకృత్యాలు, దారుణాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రతీ నిముషం దేశంలో ఏదో ఒక చోట అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ లో జరిగిన ఓ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. అమ్మాయి భద్రత ప్రశ్నార్థకంగా మారేలా చేస్తోంది. ఆడపిల్లల తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తోంది.
రాజస్థాన్ లో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునే కీచకపర్వానికి తెరతీశారు. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారయత్నం చేసి, హత మార్చడమే కాకుండా.. అనంతరం బాలిక మృతదేహంపై కూడా అత్యాచారం కొనసాగించిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బుండీ పట్టణంలో వెలుగుచూసింది.
ఒమిక్రాన్ ఎఫెక్ట్: పంజాబ్లో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు
గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన తప్పిపోయిన పదహారేళ్ల బాలిక మృతదేహమై కనిపించింది. పదహారేళ్ల బాలిక శవ పరీక్ష నివేదికలో దుండగులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. అంతేకాదు పోస్టుమార్టం చేసిన వైద్యులు ఓ భయంకర నిజాన్ని తెలుసుకుని షాక్ కు గురయ్యారు. ఆమె మీద అత్యాచార యత్నం చేసి, చంపేయడమే కాకుండా ఆమె మరణించిన తర్వాత కూడా బాలిక మృతదేహంపై నిందితులు అత్యాచారం కొనసాగించారని పోస్టుమార్టంలో తేలింది.
వివరాల్లోకి వెడితే.. బుండి పట్టణ శివార్లలోని పొలాల్లో ఓ పదహారేళ్ళ వయసు గల బాలిక మేకలను మేపేందుకు వెళ్లింది. ఆ తరువాత అదృశ్యమైంది. ఆ బాలికను అపహరించిన ముగ్గురు కామాంధులు.. గిరిజన బాలికపై సామూహిక అత్యాచార యత్నం చేయగా, ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమె గొంతు నులిమి చంపేశారు. ఆ తరువాత అంతటితో ఆగకుండా ఆమె శవం మీద కూడా అత్యాచారానికి తెగబడ్డారు.
coronavirus: భారత్ లో కరోనా కల్లోలం..37 వేలకు పైగా కొత్త కేసులు.. 1892 ఒమిక్రాన్ కేసులు..
శవ పరీక్షలో బాలిక ప్రైవేటు భాగాల్లో 30కి పైగా గాయాలయ్యాయని తేలింది. నిందితులు ఆమె శరీరంపై గీతలు వేశారు. బాలికపై అత్యాచారం చేయడానికి ముందు నిందితులు ఆమెను దుపట్టాతో కట్టేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ‘నా జీవితంలో ఇంత దారుణమైన సంఘటన చూడలేదు. బుండీ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా తాము నిందితుల తరపున కోర్టులో వాదించబోమని ప్రకటించారు’ అని బుండి జిల్లా ఎస్పీ జై యాదవ్ చెప్పారు.
ఇదిలా ఉండగా, పదమూడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం అశ్వాపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన సదరు బాలిక అమ్మమ్మ ఇంటివద్ద ఉంటోంది. ఆ పక్క ఇంట్లోనే జె. సాంబశివరావు (26) ఉంటున్నాడు.
శుక్రవారం ఒంటరిగా ఉన్న బాలికను ఆ యువకుడు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పనికి వెళ్లి వచ్చిన అమ్మమ్మకు బాధిత చిన్నారి విషయం చెప్పింది. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు నిందితుని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అశ్వాపురం సీఐ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.