బిల్డింగ్‌పై నుంచి దూకి నిందితుడు ఆత్మహత్య.. ఎస్ఐ సస్పెన్షన్

Siva Kodati |  
Published : Feb 28, 2021, 03:56 PM ISTUpdated : Feb 28, 2021, 03:57 PM IST
బిల్డింగ్‌పై నుంచి దూకి నిందితుడు ఆత్మహత్య.. ఎస్ఐ సస్పెన్షన్

సారాంశం

పోలీస్ కస్టడీలో వున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ నకిలీ పత్రాలు సృష్టించి నాగరాజు అనే వ్యక్తి నుంచి పుట్టలింగస్వామి రూ. 13 లక్షలు తీసుకున్నాడు

పోలీస్ కస్టడీలో వున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ నకిలీ పత్రాలు సృష్టించి నాగరాజు అనే వ్యక్తి నుంచి పుట్టలింగస్వామి రూ. 13 లక్షలు తీసుకున్నాడు.

దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు హనుమంతనగర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పుట్టలింగస్వామిని అరెస్ట్‌ చేసి శుక్రవారం రాత్రి ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చారు.

మేడపై పత్రాలు ఉన్నాయని చెప్పిన పుట్టలింగస్వామి పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన పోలీసులు ఎట్టకేలకు తేరుకుని నిందితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి  హనుమంతనగర ఎస్‌ఐ మంజునాథ్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు.   

PREV
click me!

Recommended Stories

BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్