AAP Tiranga Shakha: యూపీలో 1000 చోట్ల.. ఆర్‌ఎస్‌ఎస్ కు పోటీగా "ఆప్ తిరంగ శాఖ" ప్రారంభం 

Published : Jul 02, 2022, 06:21 AM ISTUpdated : Jul 02, 2022, 06:22 AM IST
AAP Tiranga Shakha: యూపీలో 1000 చోట్ల.. ఆర్‌ఎస్‌ఎస్ కు పోటీగా "ఆప్ తిరంగ శాఖ" ప్రారంభం 

సారాంశం

AAP Tiranga Shakha: ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఉత్తరప్రదేశ్ అంతటా ఏకకాలంలో 1,000 ప్రదేశాలలో 'తిరంగ శాఖ'లను ప్రారంభించింది. ప్రజలు తమ విధులను గుర్తుచేసుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తిరంగ శాఖ ప‌నిచేస్తుందని ఆప్ తెలిపింది.

AAP Tiranga Shakha: ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు బీజేపీపై ఆధిపత్యం కోసం ఆర్ఎస్ఎస్ తరహాలో.. ఆప్ తిరంగ శాఖను ప్రారంభించింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్ అంతటా దాదాపు 1000 చోట్ల పార్టీ ఏకకాలంలో తిరంగ శాఖను నిర్వహించింది. ఈ సమాచారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ, ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ సంజయ్ సింగ్ తెలిపారు. త్రివర్ణ పతాకం ముందు జాతీయ గీతాలాపన అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డా.భీంరావు అంబేద్కర్ జీవితం, కృషిపై చర్చ,  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అదే సమయంలో రాజ్యాంగంపై తమకున్న నిబద్ధతను చాటుకుంటున్నామని అన్నారు. భారత రాజ్యాంగంలోని వివిధ అంశాలను ప్రస్తావిస్తూ.. రాజ్యాంగ సారాంశం రాజ్యాంగ పీఠికలోనే ఉందన్నారు. భారత ప్రజలు భారత రాజ్యాంగాన్ని స్వీకరించారు. ఇది మనమందరం ఆమోదించిన రాజ్యాంగమని, అందుకే ఈ దేశ వ్యవస్థ శాసనాల ప్రకారం నడుస్తుందని, డాక్టర్ భీంరావు అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారానే నడుస్తుందని అన్నారు.

భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యం, భారత సామాజిక వ్యవస్థ ప్రమాదంలో పడ్డాయని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి సందర్భాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయని సంజయ్ సింగ్ అన్నారు. ఇది బాబా సాహెబ్ రూపొందించిన రాజ్యాంగం, ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని,  రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించే బాధ్య‌త ప్రతి ఒక్క‌రిపై ఉంద‌ని అన్నారు. రాజ్యాంగం ప్ర‌కార‌మే.. దేశ చ‌ట్టాలు రూపొందుతాయ‌ని తెలిపారు. ఈ సమయంలో సంజయ్ సింగ్.. భారత రాజ్యాంగ ప్రవేశికను చదివారు. దానిని అక్కడ ఉన్న ఇతరులు పునరావృతం చేశారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు