
Punjab election result 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని భావించారు. కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ అధిక్యం లో దూసుకుపోతోంది. ప్రస్తుత ఎన్నికల కౌంటింగ్ గమనిస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటూతూ.. ఏకంగా 100 స్థానాల అధిక్యం దిశగా ముందుకు సాగుతోంది. దీంతో మరో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు సంకేతాలు పంపింది.
ఇప్పటివరకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి అందిన వివరాల గమనిస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో అధిక్యం కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ 18 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఏస్ఏడీ కూటమి 7 స్థానాల్లో అధిక్యంలో ఉండగా, బీజేపీ కూటమి 4 స్థానాల్లో మాత్రమే ముందజల్లో ఉంది.
పంజాబ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభ ట్రెండ్లు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ముందంజలో ఉంచుతూ.. ట్రెంగ్ కనిపింది. ఈ క్రమంలోనే పంజాబ్లో ఓట్ల లెక్కింపు ప్రారంభ పోకడలు ముందుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగా, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తోంది. హోరాహోరీగా సాగిన బహుళ మూలల పోరులో కాంగ్రెస్ రెండో స్థానానికి పడిపోయింది.
తాజా వివరాల ప్రకారం.. మొత్తం 117 సీట్లలో AAP 83, కాంగ్రెస్కు 18 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. అలాగే, అకాలీలు 9, బీజేపీ, మిత్రపక్షాలు 4 స్థానాల్లో ముందజల్లో ఉన్నాయి. ఇదిలావుండగా, పంజాబ్ లో ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో మొత్తం 117 స్థానాలకు ఫపోలింగ్ జరిగింది. మొత్తం 2.14 కోట్ల ఓటర్లు ఉండగా.. 72 శాతం పోలింగ్ నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఇది 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన పోలింగ్ శాతంతో పోలిస్తే తక్కువగా ఉంది. పంజాబ్లో 2017లో 77.4 శాతం పోలింగ్ నమోదైంది.
పంజాబ్లో మొత్తం 117 శాసనసభ స్థానాలు ఉండగా.. ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. ఇక, పంజాబ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారన్ని నిలుపుకోవాలని చూస్తోంది. పంజాబ్లో వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎస్ఏడీ బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించిం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లలో, ఆప్ 20 చోట్ల గెలిచింది. ఎస్ఏడీ–బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.. పంజాబ్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక, సాగు చట్టాల విషయంలో బీజేపీకి దూరం జరిగిన ఎస్ఏడీ.. ఈ ఎన్నికలల్లో బీఎస్పీతో జట్టు కట్టింది. ఇక, బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, బాదల్ నేతృత్వంలోని ఎస్ఏడీ (సంయుక్త)తో కలిసి బరిలోకి దిగింది.