తమిళనాడులో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: తొమ్మిది మంది మృతి

Published : May 12, 2023, 09:27 AM ISTUpdated : May 12, 2023, 09:43 AM IST
తమిళనాడులో   వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: తొమ్మిది మంది  మృతి

సారాంశం

తమిళనాడు  రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో  జరిగిన  రోడ్డు ప్రమాదాల్లో  తొమ్మిది  మంది మృతి చెందారు. 

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో  శుక్రవారంనాడు  జరిగిన  వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో  తొమ్మిది మంది  మృతి చెందారు. రాష్ట్రంలోని   కన్యాకుమారిలో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.   మరో ముగ్గురు గాయపడ్డారు. మరో వైపు  రాష్ట్రంలోని మైలాడుదురైలో  బస్సు, బైక్ ను లారీ ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో  ఐదుగురు మృతి చెందారు.  మరో ఆరుగురు గాయపడ్డారు. 

దేశ వ్యాప్తంగా  పలు  రాష్ట్రాల్లో   రోడ్డు ప్రమాదాలు  చోటు  చేసుకుంటున్నాయి.   రోడ్డు ప్రమాదాలకు  డ్రైవర్ల  తప్పిదాలతో పాటు  అతి వేగం కూడా  కారణంగా  పోలీసులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  ఏవోబీలో ఈ నెల  4న  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు. 
ట్రాక్టర్ బోల్తా పడడంతో  ముగ్గురు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. బంధువు  అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు  చేసుకుంది. ఈ నెల  4వ తేదీన  తమిళనాడు  రాష్ట్రంలోని మహాబలిపురంలో  జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 

ఈ నెల  6వ తేదీన  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  ఐదుగురు మృతి చెందారు.  వ్యాన్, మరో వాహనం ఢీకొనడంతో  ఈ ప్రమాదం  చోటు  చేసుకుంది.  యూపీలోని హర్దోయ్  ప్రాంతంలో  రోడ్డు ప్రమాదం  జరిగింది.  

ఈ నెల  9వ తేదీన  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో  బస్సు  బోరాడ్  నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో  22 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. బ్రిడ్జి   రెయిలింగ్ ను ఢీకొట్టి బోరాడ్ నదిలో  బస్సు పడిపోయింది.  శ్రీఖండి  నుండి  ఇండోర్  వైపు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం  జరిగింది.

ఛత్తీస్‌ఘడ్  రాష్ట్రంలో  ఈ నెల  10న  ఘోర ప్రమాదం చోటు  చేసుకుంది.  ఈ ప్రమాదంలో  ఒకే కుటుంబానికి  చెందిన నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలోని మోర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో గల మదన్ పూర్ ఫారెస్ట్ బారియర్ వద్ద ట్రక్కు, కారు ఢీకొట్టింది.  దీంతో  ఒకే కుటుంబానికి  చెందిన నలుగురు మృతి చెందారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..