పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..

Published : May 22, 2022, 10:37 AM IST
పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలోని Jogia Kotwali ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 28పై ఆగివున్న లారీని ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందారు.

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలోని Jogia Kotwali ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 28పై ఆగివున్న లారీని ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్‌యూవీ వాహనంలో 11 మంది ఉన్నారు. వారంతా వివాహా వేడుకకు హాజరై తిరగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం గోరఖ్‌పూర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్ట‌మ్ నిమిత్తం తరలించారు. ఇక, ఎస్‌యూవీ వాహనం డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.   

ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. 

 

 

ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు  ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్టు పీఎంవో ప్రకటించింది. గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50,000 అందజేస్తామని పీఎంవో తెలిపింది.

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations