కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

By Siva KodatiFirst Published Sep 12, 2021, 7:18 PM IST
Highlights

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులోని 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా... మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులోని 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా... మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!