కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Sep 12, 2021, 07:18 PM IST
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

సారాంశం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులోని 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా... మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులోని 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా... మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu