ఏడేళ్ల బాలుడి దారుణ హత్య: కాళ్లు, చేతులు, నాలుక కోసిశారు

Published : Jul 12, 2018, 11:34 AM IST
ఏడేళ్ల బాలుడి దారుణ హత్య: కాళ్లు, చేతులు, నాలుక కోసిశారు

సారాంశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సామ్లీలో బుధవారం ఏడేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు. సమీర్ అనే బాలుడిని గొంతు నులిమి చంపేశారని పోలీసు సూపరింటిండెంట్ దినేష్ కుమార్ చెప్పారు. 

ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సామ్లీలో బుధవారం ఏడేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు. సమీర్ అనే బాలుడిని గొంతు నులిమి చంపేశారని పోలీసు సూపరింటిండెంట్ దినేష్ కుమార్ చెప్పారు. 

బాలుడి చేతులు, కాళ్లు, నాలుక కోసేశారని ఆయన చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. సామ్లీలోని ఆదర్శ్ మండి పొలాల్లో బాలుడి శవం కనిపించింది.

ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారంనాడు బాలుడ్ని కిడ్నాప్ చేశారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu