కారుపై విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు  మృత్యువాత

Published : Oct 10, 2023, 12:49 AM IST
కారుపై విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు  మృత్యువాత

సారాంశం

ఉత్తరాఖండ్ లోని పితోర్‌గఢ్‌ లో కారుపై కొండ చరియలు విరిగిపడ్డ ఘటన  వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌ జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం నాడు ఓ కారుపై కొండచరియలు విగిరిపడ్డాయి. ఈ బాధాకరమైన ప్రమాదం ఘటనలో కొండపై నుండి భారీ మొత్తంలో శిధిలాలు అకస్మాత్తుగా కారుపై పడ్డాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తులు శిధిలాల కింద సమాధి అయ్యారు. దీంతో ఈ కారులో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంఘటన ధార్చుల సబ్ డివిజన్‌లోని కైలాష్ మానసరోవర్ రోడ్డులోని తక్తిలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. ఈ ప్రమాదంపై ధార్చుల డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దివేష్ షాస్ని మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన కారు బుండి నుండి వస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో కైలాష్ మానసరోవర్ రోడ్డులోని థాకిటీ వద్ద కొండపై నుంచి చాలా శిధిలాలు కారుపై పడ్డాయి. 

కొనసాగుతున్న సహాయక చర్యలు 

ప్రమాదం జరిగినప్పుడు కారులో దాదాపు ఏడుగురు ప్రయాణిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ డిప్యూటీ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. తాకిడి కొండపై నుంచి వచ్చిన చెత్తాచెదారంతో వారు కారుతోపాటు శిథిలాల కింద కూరుకుపోయారు. ఘటన అనంతరం అక్కడ కేకలు మొదలయ్యాయి. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, సైనిక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఏడుగురు బలి !

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం శిథిలాల తొలగింపు కోసం శ్రమిస్తున్నారు. కారులో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై చెత్తాచెదారం ఉండడంతో రోడ్డు కూడా నిలిచిపోయింది.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం