దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రక్.. ఆరుగురి మృతి

Published : Mar 29, 2021, 09:24 AM ISTUpdated : Mar 29, 2021, 09:27 AM IST
దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రక్.. ఆరుగురి మృతి

సారాంశం

అదుపుతప్పిన ఒక ట్రక్కు మిఠాయి దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 

హోలీ పండగ రోజున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రజలందరూ హోలీ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఓ ట్రక్కు...మిఠాయి దుకాణంలోకి దూసుకెళ్లింది. కాగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బీహార్‌లోని నలందా జిల్లా పరిధిలోని తాడ్పురా గ్రామంలో హోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకవైపు హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుండగా, మరోవైపు ఈ ప్రమాదం స్థానికులను కలచివేసింది. అదుపుతప్పిన ఒక ట్రక్కు మిఠాయి దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ సహాయక చర్యల్లో స్థానికులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఘటన అనంతరం కొందరు అల్లరి మూకలు స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. స్టేషన్‌హెడ్‌కు చెందిన సర్వీస్ రివాల్వర్ లాక్కున్నారు. తరువాత పోలీసులు వారిని శాంతింపజేసి, నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్