అసోం జైలులో 53 మంది ఖైదీలకు కరోనా..

Published : May 20, 2021, 10:33 AM IST
అసోం జైలులో 53 మంది ఖైదీలకు కరోనా..

సారాంశం

కరోనా మహమ్మారి జైలులోని ఖైదీలనూ వదిలిపెట్టడం లేదు. అసోం రాష్ట్రంలోని దిబ్రూఘడ్ సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలకు కరోనా సోకింది. దిబ్రూఘడ్ కేంద్ర కారాగారంలోని 223 మంది ఖైదీలకు కరోనా పరీక్సలు చేయగా వారిలో 53 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు దిబ్రూఘడ్ డిప్యూటీ కమిషనర్ పల్లవ్ గోపాల్ ఝా చెప్పారు. 

కరోనా మహమ్మారి జైలులోని ఖైదీలనూ వదిలిపెట్టడం లేదు. అసోం రాష్ట్రంలోని దిబ్రూఘడ్ సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలకు కరోనా సోకింది. దిబ్రూఘడ్ కేంద్ర కారాగారంలోని 223 మంది ఖైదీలకు కరోనా పరీక్సలు చేయగా వారిలో 53 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు దిబ్రూఘడ్ డిప్యూటీ కమిషనర్ పల్లవ్ గోపాల్ ఝా చెప్పారు. 

జైలులో కరోనా సోకిన ఖైదీల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశామని, వైద్యులు, అంబులెన్స్ లను పంపించామని ఝా తెలిపారు. కొత్తగా వచ్చిన ఖైదీ ఒకరు కరోనా పాజిటివ్ కావడంతో.. అతని ద్వారా జైలులోని 53 మందికి కరోనా సోకిందని భావిస్తున్నామని అన్నారు. 

ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అసోం మెడికల్ కాలేజీకి పంపించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దిబ్రూఘడ్ జిల్లాలో 4,206 కరోనా కేసులు వెలుగు చూశాయి. అసోం రాష్ట్రంలో ఒక్క రోజే 6,143 కరోనా కేసులు బయటపడ్డాయి. అసోంలో కరోనాకట్టడి కోసం ఆంక్షలు విధించారు. 

ఇదిలా ఉండగా, ఇండియాలో గత 24 గంటల్లో 2,76,110 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,57,72,440కి చేరుకొంది. కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 2,23,55,440 కి చేరుకొందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డేటా తెలిపింది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు  9 వేలు పెరిగాయి. వరుసగా నాలుగో రోజు మూడు లక్షలలోపుగా కరోనా కేసులు రికార్డయ్యాయి.

కరోనాతో గత 24 గంటల్లో దేశంలో 3,874 మంది మరణించారు.దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,87,122కి చేరుకొంది. దేశంలో 86.23 శాతంగా రికవరీ రేటు నమోదైంది. కరోనా పరీక్షను ఇంట్లో నిర్వహించేందుకు కేంద్రం బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ విషయమై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా సోకిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టు పొందినవారితో పాటు కుటుంబసభ్యులు ఇంట్లో పరీక్షను ఉపయోగించుకోవచ్చని ఐసీఎంఆర్ తెలిపింది.

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య కల్గించింది. అయితే అందుకు భిన్నంగా బుధవారం నాడు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4 వేల లోపుగా నమోదైంది. లాక్‌డౌన్  కారణంగా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టుగా ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు