కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇస్రో క్యాంటీన్‌లో పనిచేస్తున్న ఐదుగురు మృతి..

Published : Jan 23, 2023, 12:25 PM IST
కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇస్రో క్యాంటీన్‌లో పనిచేస్తున్న ఐదుగురు మృతి..

సారాంశం

కేరళలోని అలప్పుజా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీ- కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు.

కేరళలోని అలప్పుజా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీ- కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. వివరాలు.. సోమవారం తెల్లవారుజామున అలప్పుజా జిల్లా అంబలపుజా సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బియ్యం లోడుతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి అలప్పుజకు వెళ్తున్న లారీ.. తిరువనంతపురం వైపు వెళ్తున్న కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను అలప్పుజా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఉన్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను ప్రసాద్, షిజు, అమల్, సచిన్, సుమోద్‌లుగా గుర్తించారు. వీరు తిరువనంతపురంలోని ఇస్రో క్యాంటీన్‌లో పనిచేస్తున్నారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించి లారీ డ్రైవర్‌, సహాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
BJP : తెలంగాణ బిజెపికి బిగ్ షాక్... జాతీయ స్థాయిలో ఉన్న రెండు పదవులూ పాయే..!