మణిపూర్‌: అసోం రైఫిల్స్‌పై ‌ ఉగ్రవాదుల మెరుపుదాడి .. ఆఫీసర్ కుటుంబం సహా నలుగురు సైనికులు మృతి..?

Siva Kodati |  
Published : Nov 13, 2021, 02:29 PM ISTUpdated : Nov 13, 2021, 03:10 PM IST
మణిపూర్‌: అసోం రైఫిల్స్‌పై ‌ ఉగ్రవాదుల మెరుపుదాడి .. ఆఫీసర్ కుటుంబం సహా నలుగురు సైనికులు మృతి..?

సారాంశం

మణిపూర్‌లో (manipur) జవాన్లపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అసోం రైఫిల్స్ (Assam Rifles) యూనిట్ జవాన్లతో వెళ్తున్న కాన్వాయ్‌పై దాడి చేశారు. చూరచాంద్‌పూర్ (Suraj Chand district) జిల్లా బెహియంగ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి, అతని భార్య, కుమారుడు, మరో నలుగురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. 

మణిపూర్‌లో (manipur) జవాన్లపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అసోం రైఫిల్స్ (Assam Rifles) యూనిట్ జవాన్లతో వెళ్తున్న కాన్వాయ్‌పై దాడి చేశారు. చూరచాంద్‌పూర్ (Suraj Chand district) జిల్లా బెహియంగ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి, అతని భార్య, కుమారుడు, మరో నలుగురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.

ఈ ఘటన శనివారం ఉదయం 10 గంటల సమయంలో చురచంద్‌పూర్ జిల్లాలోని మయన్మార్ సరిహద్దుల్లో (india myanmar border) చోటు చేసుకుంది. సైనికులు తేరుకునేలోపు ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో అస్సాం రైఫిల్స్ వైపు భారీగా ప్రాణనష్టం జరిగినట్లుగా సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మణిపూర్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (people's liberation army) ఈ దాడి వెనుక వున్నట్లు సైన్యం అనుమానిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

మణిపూర్ (manipur chief minister) ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ (biren singh) ఈ మెరుపు దాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పిరికిపంద చర్యను అంత తేలిగ్గా వదిలిపెట్టబోమన్నారు. దోషులను చట్టం ముందు నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని బీరెన్ సింగ్ అన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్