ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి

Published : Aug 29, 2018, 05:41 PM ISTUpdated : Sep 09, 2018, 11:17 AM IST
ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి

సారాంశం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోఫియాన్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ బృందంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు.  

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోఫియాన్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ బృందంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు.

సోఫియాన్ జిల్లాలో అరహమా ప్రాంతంలో నిలిచిపోయిన ఓ వాహనాన్ని తీసుకురాడానికి ఓ పోలీస్ బృందం వెళ్లింది. అయితే ఈ విషయం తెలిసి అప్పటికే అక్కడ కాపుకాచిన ఉగ్రవాదులు వీరిపై కాల్పులకు తెగబడ్డారు.అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో పోలీసులు అప్రమత్తమయ్యేందుకు అసలు సమయమే లేకుండా పోయింది. దీంతో నలుగురు పోలీసులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు.

ఈ దాడిలో భారీగా ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను కూడా ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ కాల్పుల గురించి సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu