మిజోరాంలోని ఐజ్వాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెట్రోల్తో వెళ్తున్న ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. సహాయక చర్యలు కోనసాగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర యాలయ్యాయి.
మిజోరాంలోని ఐజ్వాల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్ జిల్లా తుయిరియాల్ వద్ద పెట్రోల్ తో వెళ్తున్న ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు ఐజ్వాల్ ఎస్పీ సి లాల్రువా మీడియాతో తెలిపారు. ఈ ఘటనలో ఓ ట్యాక్సీ, ద్విచక్ర వాహనాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Mizoram | At least 4 people died & 10 others injured in a fire incident in Tuirial, Aizawl district, after a tanker carrying petrol caught fire. More details awaited
"A four-wheeler taxi & two 2-wheelers got damaged in the incident," Aizawl SP C Lalruaia pic.twitter.com/7i0aDNPoGC