మహారాష్ట్ర ఆర్మీ డిపోలో పేలుడు: 6గురు మృతి

By pratap reddyFirst Published Nov 20, 2018, 10:28 AM IST
Highlights

మహారాష్ట్రలోని ఆర్మీ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా పదిమంది గాయపడ్డారు. వార్థాలోని పుల్గావ్ ఆర్మీ డిపోలో మంగళవారం ఉదయం ఈ పేలుడు సంభవించింది.

వార్ధా: మహారాష్ట్రలోని ఆర్మీ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా పది మంది గాయపడ్డారు. వార్థాలోని పుల్గావ్ ఆర్మీ డిపోలో మంగళవారం ఉదయం ఈ పేలుడు సంభవించింది.

డిపోలో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. గాయపడినవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ఆయుధ కర్మాగారం ఉద్యోగులతో పాటు ఇద్దరు కార్మికులున్నారు. 

పేలుడు సంభవించినప్పుడు పెద్ద యెత్తున శబ్దం వినిపించింది. చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆ శబ్దం వినిపడినట్లు చెబుతున్నారు. 

మహరాష్ట్రలోని వార్ధా జిల్లాలోని ఆర్డినెన్స్ డిపో సమీపంలో పేలుడు సంభవించి ముగ్గురు మరణించారని, పాత పేలుడు పదార్థాలను ధ్వంసం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని రక్షణ శాఖ అధికారులు చెప్పారు. 

పుల్గావ్ లోని ఇదే డిపోలో 2016లో సంభవించిన పేలుడులో 16 మంది మృత్యువాత పడ్డారు.

 

: Two killed, several injured in an explosion in Pulgaon Army depot in Wardha. Further details awaited. pic.twitter.com/9hHbsBXLbO

— ANI (@ANI)
click me!