మహారాష్ట్ర ఆర్మీ డిపోలో పేలుడు: 6గురు మృతి

Published : Nov 20, 2018, 10:28 AM ISTUpdated : Nov 20, 2018, 10:33 AM IST
మహారాష్ట్ర ఆర్మీ డిపోలో పేలుడు: 6గురు మృతి

సారాంశం

మహారాష్ట్రలోని ఆర్మీ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా పదిమంది గాయపడ్డారు. వార్థాలోని పుల్గావ్ ఆర్మీ డిపోలో మంగళవారం ఉదయం ఈ పేలుడు సంభవించింది.

వార్ధా: మహారాష్ట్రలోని ఆర్మీ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా పది మంది గాయపడ్డారు. వార్థాలోని పుల్గావ్ ఆర్మీ డిపోలో మంగళవారం ఉదయం ఈ పేలుడు సంభవించింది.

డిపోలో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. గాయపడినవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ఆయుధ కర్మాగారం ఉద్యోగులతో పాటు ఇద్దరు కార్మికులున్నారు. 

పేలుడు సంభవించినప్పుడు పెద్ద యెత్తున శబ్దం వినిపించింది. చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆ శబ్దం వినిపడినట్లు చెబుతున్నారు. 

మహరాష్ట్రలోని వార్ధా జిల్లాలోని ఆర్డినెన్స్ డిపో సమీపంలో పేలుడు సంభవించి ముగ్గురు మరణించారని, పాత పేలుడు పదార్థాలను ధ్వంసం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని రక్షణ శాఖ అధికారులు చెప్పారు. 

పుల్గావ్ లోని ఇదే డిపోలో 2016లో సంభవించిన పేలుడులో 16 మంది మృత్యువాత పడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం