మందుపాతర పేల్చిస మావోలు: నలుగురు సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి

Published : Oct 27, 2018, 06:18 PM ISTUpdated : Oct 27, 2018, 07:57 PM IST
మందుపాతర పేల్చిస మావోలు: నలుగురు సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి

సారాంశం

ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులకు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్పీఎఫ్) చెందిన సైనికులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. 

రాయపూర్: ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులకు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్పీఎఫ్) చెందిన సైనికులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. 

ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వివరాలు తెలియాల్సి ఉంది. నక్సలైట్లు మైన్ ప్రొటెక్టెడ్ వెహికిల్ (ఎంపివి)ని పేల్చి వేశారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం 4 గంటలకు అవపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ముర్దండ సిఆర్పీఎఫ్ శిబిరం వద్ద చోటు చేసుకుంది. 

వాహనంలో ఆరుగురు సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో మావోయిస్టులు శక్తివంతమమైన మందుపాతర పేల్చారు. దీంతో నలుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. 

మరణించినవారిలో ఓ ఎఎస్ఐ, ఓ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  నవంబర్ 12వ తేదీన తొలి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

 

PREV
click me!

Recommended Stories

కిసాన్ పాఠశాలలు.. ఇక రైతులకు ఆధునిక వ్యవసాయ పాఠాలు
PM Kisan : రూ.6000 కావాలంటే ఈ పని తప్పక చేయాల్సిందే.. పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్ !